News April 12, 2025

ఫస్టియర్‌లో 70%, సెకండియర్‌లో 83% మంది పాస్

image

AP: ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఓవరాల్‌గా ఫస్ట్ ఇయర్‌లో 70%, సెకండియర్‌లో 83% మంది విద్యార్థులు పాసైనట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. 2014 నుంచి ఇదే అత్యధిక పాస్ పర్సెంటేజ్ అని తెలిపారు. GOVT జూనియర్ కాలేజీల్లో సెకండియర్‌లో 69 శాతం మంది ఉత్తీర్ణత సాధించడం పదేళ్లలో అత్యధికమన్నారు. ఫస్టియర్‌లోనూ 47 శాతం మంది పాసయ్యారని, ఇది దశాబ్దంలో రెండో అత్యధికమని తెలిపారు.

Similar News

News November 24, 2025

కాలిన వత్తితో ఇలా చేస్తే.. ఇంటికి ఎంతో మంచిది

image

దీపారాధనలో కాలిపోయిన వత్తిని చాలామంది పడేస్తుంటారు. కానీ, దానిలో ఎంతో సానుకూల శక్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ‘కాలిన 10 వత్తులలో కర్పూరం వెలిగించి, అందులో 4 లవంగాలు వేసి దూపంలా తయారుచేసుకోవాలి. ఆ పొగను ఇల్లు అంతటా వ్యాపించేలా చేస్తే.. ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ బయటకి వెళ్లిపోతాయి. ఆ బూడిదను దిష్టి తీయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది’ అని అంటున్నారు.

News November 24, 2025

ఆశ్లేష కురిస్తే ఆరోగ్యం

image

ఆశ్లేష నక్షత్రం సాధారణంగా జూలై చివరిలో లేదా ఆగస్టు మొదటి వారంలో వస్తుంది. ఆ సమయంలో వర్షాలు సమృద్ధిగా కురిస్తే, పంట పొలాలకు నీరు అందుతుంది, భూమి సారవంతమవుతుంది అలాగే ఆ సంవత్సరంలో మంచి దిగుబడి వస్తుందని రైతుల నమ్మకం. దీని వల్ల ప్రజలందరికీ ఆహార భద్రత ఏర్పడి, సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉంటారని ఈ సామెత సూచిస్తుంది.

News November 24, 2025

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మితే క్రిమినల్ కేసులు

image

TG: ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మితే లబ్ధిదారులపై POT యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హౌసింగ్ కార్పొరేషన్ MD పీవీ గౌతమ్ తెలిపారు. అలాంటి ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ఇళ్లు అద్దెకు ఇచ్చినా రద్దు చేస్తామని పేర్కొన్నారు. GHMCలో ఇప్పటికే సర్వే చేశామని, త్వరలో జిల్లాల్లోనూ సర్వే చేస్తామన్నారు. కొల్లూరు, రాంపల్లిలో ₹20L-50Lకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.