News April 12, 2025

ఫస్టియర్‌లో 70%, సెకండియర్‌లో 83% మంది పాస్

image

AP: ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఓవరాల్‌గా ఫస్ట్ ఇయర్‌లో 70%, సెకండియర్‌లో 83% మంది విద్యార్థులు పాసైనట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. 2014 నుంచి ఇదే అత్యధిక పాస్ పర్సెంటేజ్ అని తెలిపారు. GOVT జూనియర్ కాలేజీల్లో సెకండియర్‌లో 69 శాతం మంది ఉత్తీర్ణత సాధించడం పదేళ్లలో అత్యధికమన్నారు. ఫస్టియర్‌లోనూ 47 శాతం మంది పాసయ్యారని, ఇది దశాబ్దంలో రెండో అత్యధికమని తెలిపారు.

Similar News

News April 22, 2025

రిటైరైనా A+ కేటగిరీలో కోహ్లీ, రోహిత్, జడ్డూ.. ఎందుకంటే?

image

అన్ని ఫార్మాట్లు ఆడే వారికే BCCI A+ కేటగిరీ కాంట్రాక్టు కట్టబెడుతుంది. కానీ గతేడాది కోహ్లీ, రోహిత్, జడేజాలు టీ20లకు గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం వారు వన్డేలు, టెస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనిపై క్రికెట్ అభిమానుల్లో సందేహం నెలకొంది. అయితే, వీరు అక్టోబర్ 1, 2023 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ సభ్యులుగా ఉన్నారు. దీంతో వీరికి A+ కేటగిరీ కాంట్రాక్టు లభించింది.

News April 22, 2025

అమిత్ షా‌కు ప్రధాని మోదీ ఫోన్

image

సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న PM నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌కు ఫోన్ చేశారు. జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి గురించి అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, ఘటనా‌స్థలికి వెళ్లి పరిశీలించాలని అమిత్ షాను PM ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయన ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉగ్రదాడిలో ఇప్పటి వరకు ఐదుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది.

News April 22, 2025

ఇన్‌స్టాలో RCB మరో మైలురాయి

image

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాలో ఆర్సీబీ ఫ్రాంచైజీ మరో మైలురాయి చేరుకుంది. అత్యధిక ఫాలోవర్లు కలిగిన తొలి ఐపీఎల్ జట్టుగా నిలిచింది. ప్రస్తుతం ఈ టీమ్‌కు 19 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాత CSK (18.3M), MI(17M), KKR(7.3M), SRH (5.4M), RR(4.9M), GT (4.7M), DC (4.5M), PBKS(4M), LSG (3.6M) ఉన్నాయి.

error: Content is protected !!