News March 19, 2024

71,246 మంది ‘డిపాజిట్’ గల్లంతు

image

దేశంలో 1951 నుంచి ఇప్పటి వరకు లోక్‌సభ ఎన్నికల్లో 91,160 మంది పోటీ చేయగా, 71,246 మంది <<12002638>>డిపాజిట్<<>> కోల్పోయినట్లు EC డేటాలో వెల్లడైంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి 1951లో జనరల్ అభ్యర్థులకు ₹500, SC, STలకు ₹250 సెక్యూరిటీ డిపాజిట్ ఉండేది. ప్రస్తుతం ఆ మొత్తం జనరల్ క్యాండిడేట్లకు ₹25వేలు, ఎస్సీ, ఎస్టీలకు ₹12,500గా ఉంది. పోలైన ఓట్లలో ఆరోవంతు ఓట్లు రాకుంటే ఆ మొత్తం ఈసీ ట్రెజరీకి వెళ్తుంది.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News December 3, 2025

స్క్రబ్ టైఫస్.. జాగ్రత్తలపై అధికారుల సూచనలు

image

AP: ‘ఓరియంటియా సుత్సుగముషి’ బాక్టీరియాతో <<18446507>>స్క్రబ్ టైఫస్<<>> సంక్రమిస్తుందని అధికారులు వెల్లడించారు. కీటకం కుట్టిన చోట నల్లటి మచ్చతో పాటు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు ఉంటే స్క్రబ్ టైఫస్‌గా అనుమానించాలని చెప్పారు. ఎలుకలు సంచరించే ప్రదేశాల్లోని కీటకాలు కుడితే ఈ వ్యాధి వస్తుందన్నారు. పొలం పనులకు వెళ్లేవారు షూలు ధరించాలని, మంచాలు, పరుపులు, దిండ్లు వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలని సూచించారు.
Share it

News December 3, 2025

APPSC పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

image

APPSC ఈ క్యాలెండర్ ఇయర్‌లో విడుదల చేసిన 21 ఉద్యోగ నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలను <>ప్రకటించింది<<>>. రాతపరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (పేపర్-1) పరీక్ష జనవరి 27, 31, ఫిబ్రవరి 9, 11, 12 తేదీల్లో, సంబంధిత సబ్జెక్టు పేపర్ల పరీక్షలు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు నిర్వహించనున్నారు. విశాఖ, తూ.గో., NTR, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పరీక్షలు జరగనున్నాయి.

News December 3, 2025

టెన్త్ అర్హతతో 362 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 362 మల్టీ టాస్కింగ్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్ అర్హతగల అభ్యర్థులు ఈనెల 14వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్( టైర్ 1, టైర్ 2) ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.18,000-రూ.56,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: mha.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.