News August 8, 2024

రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి రూ.7,266 కోట్లు

image

AP: రాష్ట్రంలో రూ.7,266 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. పలు కీలక ప్రాజెక్టులను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ తూర్పు బైపాస్‌కు రూ.2,716 కోట్లు, వినుకొండ-గుంటూరు రోడ్డుకు రూ.2,360 కోట్లు, సబ్బవరం-షీలానగర్ రోడ్డుకు రూ.906 కోట్లు, విజయవాడ మహానాడు జంక్షన్-నిడమానూరు రోడ్డుకు రూ.669 కోట్లు, చెన్నై-కోల్‌కతా హైవేపై రణస్థలం రహదారికి రూ.325 కోట్లు కేటాయించింది.

Similar News

News December 1, 2025

ఈ దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుంటే?

image

స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః|
అనాదినిధనో ధాతా విధాతా ధాతు రుత్తమః||
తనంతట తాను అవతరించిన శాంతి స్వరూపుడు, సూర్యుడికి జన్మనిచ్చిన కలువ పూల కన్నులు కలవాడు విష్ణుమూర్తి. ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించి, నిర్మించి, పాలించే ఆయనను పూజించడం కన్నా మోక్ష మార్గం మరొకటి లేదు. అందుకే ఆ దివ్య మంగళ రూపాన్ని ధ్యానించాలి. అప్పుడే మనస్సుకు శాంతి లభిస్తుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News December 1, 2025

ఈ దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుంటే?

image

స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః|
అనాదినిధనో ధాతా విధాతా ధాతు రుత్తమః||
తనంతట తాను అవతరించిన శాంతి స్వరూపుడు, సూర్యుడికి జన్మనిచ్చిన కలువ పూల కన్నులు కలవాడు విష్ణుమూర్తి. ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించి, నిర్మించి, పాలించే ఆయనను పూజించడం కన్నా మోక్ష మార్గం మరొకటి లేదు. అందుకే ఆ దివ్య మంగళ రూపాన్ని ధ్యానించాలి. అప్పుడే మనస్సుకు శాంతి లభిస్తుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News December 1, 2025

ప్రోటీన్ సప్లిమెంట్లు తీసుకుంటున్నారా?

image

ప్రోటీన్ పౌడర్‌లను సాధారణంగా గుడ్లు, పాలు, సోయా, బఠానీలు లేదా బియ్యం వంటి మొక్కల మూలాలతో తయారు చేస్తారు. కొన్నిసార్లు వీటి మూలాల మిశ్రమంతో తయారు చేస్తారు. చక్కెరతో కూడిన ఈ సప్లిమెంట్‌లు సమతుల్య ఆహారం ఉద్దేశ్యాన్ని విరుద్ధంగా ఉండడమే కాకుండా, మూత్రపిండాలు, ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వైద్యుల సలహా లేకుండా వీటిని వాడకూడదని సూచిస్తున్నారు.