News August 8, 2024
రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి రూ.7,266 కోట్లు

AP: రాష్ట్రంలో రూ.7,266 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. పలు కీలక ప్రాజెక్టులను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ తూర్పు బైపాస్కు రూ.2,716 కోట్లు, వినుకొండ-గుంటూరు రోడ్డుకు రూ.2,360 కోట్లు, సబ్బవరం-షీలానగర్ రోడ్డుకు రూ.906 కోట్లు, విజయవాడ మహానాడు జంక్షన్-నిడమానూరు రోడ్డుకు రూ.669 కోట్లు, చెన్నై-కోల్కతా హైవేపై రణస్థలం రహదారికి రూ.325 కోట్లు కేటాయించింది.
Similar News
News January 21, 2026
HYDలో లారియల్ తొలి గ్లోబల్ బ్యూటీ టెక్ హబ్

ప్రపంచంలోనే అతిపెద్ద కాస్మొటిక్ కంపెనీ లారియల్(L’Oréal) HYDలో తొలి గ్లోబల్ బ్యూటీ టెక్ హబ్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు దావోస్ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబుతో ఆ సంస్థ CEO నికోలస్ సమావేశమై చర్చించారు. నవంబర్లో జరిగే ప్రారంభోత్సవానికి CM రేవంత్, మంత్రి శ్రీధర్ బాబును ఆహ్వానించారు. ఆవిష్కరణలు, టెక్నాలజీ, Ai డేటాకు ఇది కేంద్రంగా పనిచేస్తుంది. భవిష్యత్తులో తయారీ కేంద్రం ఏర్పాటుకు సంస్థ ఆసక్తి చూపింది.
News January 21, 2026
మరో బ్లడ్ బాత్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఉదయం ఫ్లాట్గా మొదలై క్రమంగా కుప్పకూలాయి. నిఫ్టీ 25 వేల దిగువకు పడిపోయింది. 260 పాయింట్లు కోల్పోయి 24,950 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 935 పాయింట్లు పడి 81,250 వద్ద కొనసాగుతోంది. ట్రెంట్ షేర్లు 3%, ICICI బ్యాంక్ 2.52%, BE 2.1%, L&T 1.86% నష్టపోయాయి. అటు డాలర్తో పోలిస్తే మన కరెన్సీ విలువ సైతం భారీగా పడిపోయింది. డాలర్కు రూ.91.31 వద్ద ట్రేడవుతోంది.
News January 21, 2026
మాఘ మాసంలో నదీ స్నానం చేయలేకపోతే?

మాఘ మాసంలో నదీ స్నానం చేయలేకపోయినా, అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా నీటితో స్నానం వీలుపడకపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. మన పురాణాలు ఇందుకు మంత్ర, వాయువ్య, ఆగ్నేయ, కాపిల, ఆతప, మానస వంటి ప్రత్యామ్నాయ స్నాన పద్ధతులను సూచించాయి. మహావిష్ణువును మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ చేసే ‘మానస స్నానం’ అన్నింటికంటే ఉత్తమమైనది. భక్తితో భగవంతుడిని స్మరిస్తే మనసు శుద్ధి అవుతుంది. ఇలా భగవంతుని కృపకు పాత్రులు కావచ్చు.


