News December 23, 2024

శ్రీవారి దర్శనానికి 8గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వరస్వామిని 77,260 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 24,223 మంది తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ తెలిపింది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.12కోట్లు వచ్చినట్లు వెల్లడించింది.

Similar News

News November 17, 2025

ఢిల్లీ బ్లాస్ట్.. వరుస అరెస్టులు

image

ఢిల్లీ <<18306148>>పేలుడు<<>> కేసులో కీలక వ్యక్తి అరెస్టయ్యాడు. బ్లాస్ట్ కోసం సాంకేతిక సాయం చేసిన జసీర్ బిలాల్ అలియాస్ డానిష్‌ను శ్రీనగర్‌లో NIA అధికారులు అరెస్ట్ చేశారు. డ్రోన్లలో మార్పులు, చేర్పులు చేస్తూ రాకెట్లతో ఉగ్రదాడులకు సహకరిస్తున్నట్లు గుర్తించారు. సూసైడ్ బాంబర్ ఉమర్ నబీతో కలిసి అతడు ఉగ్ర కుట్రలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అటు అల్-ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ జావెద్ సోదరుడు అహ్మద్‌ను HYDలో అరెస్ట్ చేశారు.

News November 17, 2025

ఢిల్లీ బ్లాస్ట్.. వరుస అరెస్టులు

image

ఢిల్లీ <<18306148>>పేలుడు<<>> కేసులో కీలక వ్యక్తి అరెస్టయ్యాడు. బ్లాస్ట్ కోసం సాంకేతిక సాయం చేసిన జసీర్ బిలాల్ అలియాస్ డానిష్‌ను శ్రీనగర్‌లో NIA అధికారులు అరెస్ట్ చేశారు. డ్రోన్లలో మార్పులు, చేర్పులు చేస్తూ రాకెట్లతో ఉగ్రదాడులకు సహకరిస్తున్నట్లు గుర్తించారు. సూసైడ్ బాంబర్ ఉమర్ నబీతో కలిసి అతడు ఉగ్ర కుట్రలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అటు అల్-ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ జావెద్ సోదరుడు అహ్మద్‌ను HYDలో అరెస్ట్ చేశారు.

News November 17, 2025

ఐబొమ్మ క్లోజ్.. MovieRulz ఎప్పుడు?

image

సినిమాలను పైరసీ చేసి సినీ ఇండస్ట్రీకి తీవ్ర నష్టం కలిగిస్తున్న సైట్లను క్లోజ్ చేసే చర్యలు ముమ్మరం అయ్యాయి. ఇప్పటికే విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్న ఐబొమ్మ సైట్ నిలిచిపోయింది. అలాగే రిలీజైన రోజే పైరసీ చేసే MovieRulz, Tamil Rockers వంటి ఇతరత్రా సైట్స్‌ పని పట్టి ఇండస్ట్రీకి న్యాయం చేయాలని పలువురు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. పైరసీ నెట్‌వర్క్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.