News August 25, 2024

తిరుమలలో మరో 8 ప్రథమ చికిత్స కేంద్రాలు

image

AP: అక్టోబర్ 4 నుంచి 12 వరకు శ్రీవారి <<13894037>>బ్రహ్మోత్సవాల<<>> నేపథ్యంలో అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తిరుమల, తిరుపతిలో 12 వైద్య కేంద్రాలుండగా, భక్తులకు అసౌకర్యం కలగకుండా కొండపై కొత్తగా 8 ప్రథమ చికిత్స కేంద్రాలను సిద్ధం చేస్తున్నట్లు TTD వెల్లడించింది. ప్రముఖ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, మందులు, వైద్యపరికరాలను అందుబాటులో ఉంచుతామంది.

Similar News

News March 27, 2026

కరెంట్ అఫైర్స్

image

* హిందూ, సిక్కు, బౌద్ధం తప్ప ఇతర మతాల్లోకి మారితే SC హోదా వర్తించదని SC తీర్పు.* దేశీయ తయారీ, స్టార్టప్ రంగాల బలోపేతం కోసం ప్రభుత్వం బ్లూ స్టార్ లిమిటెడ్‌తో ఒప్పందం.* ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాక్. ఆరో స్థానంలో భారత్. * 2019 నుంచి PM-KISAN కింద రైతులకు రూ. 4.27 లక్షల కోట్లకు పైగా నిధులు అందాయి. * ఉత్తరాఖండ్ తర్వాత యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును ఆమోదించిన రెండో రాష్ట్రం గుజరాత్.

News March 27, 2026

హోటళ్లు, రెస్టారెంట్లలో ‘LPG’ బిల్లు వేస్తున్నారా?

image

హోటళ్లు, రెస్టారెంట్ల ఫుడ్ బిల్లులో ఎల్పీజీ ఛార్జ్, గ్యాస్ సర్‌ఛార్జ్, ఫ్యూయెల్ కాస్ట్ పేరుతో అదనపు డబ్బులు వసూలు చేయకూడదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. బిల్లులో మెనూ, ట్యాక్సెస్ మాత్రమే ఉండాలని తెలిపింది. ఒకవేళ ఎక్స్‌ట్రా ఛార్జ్ చేస్తే 1915 నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. హైదరాబాద్‌లో అయితే 7416687878కు వాట్సాప్ చేయాలని లేదా E-JAGRITI పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.

News March 27, 2026

నేడు రాములోరి కళ్యాణానికి సీఎం

image

TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు భద్రాచలంలో పర్యటించనున్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకొని రూ.351 కోట్లతో ఆలయ విస్తరణ తొలిదశ పనులకు భూమి పూజ, శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మిథిలా స్టేడియంలో 11:30AM నుంచి 12:30PM వరకు తిరుకళ్యాణ మహోత్సవంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.