News April 18, 2024

జువైనల్ హోం నుంచి 8మంది పరారీ

image

TG: మేడ్చల్ జిల్లా గాజులరామారంలో జువైనల్ హోం నుంచి 8మంది పరారు కావడం సంచలనంగా మారింది. వివిధ నేరాల్లో ప్రమేయమున్న 32మంది బాలురు ఈ హోంలో ఆశ్రయం పొందుతున్నారు. కాగా.. మధ్యాహ్నం పాలు తాగే సమయంలో గందరగోళం సృష్టించారు. ఒకరు కాపలాదారుడిని తోసుకొని పారిపోగా.. మరో 7మంది తరగతిలోని గ్రిల్స్ తొలగించి పరారయ్యారు. అక్కడి సిబ్బంది సస్పెండ్ అయ్యారు.

Similar News

News November 22, 2025

హైదరాబాద్‌: కొత్త DCC ప్రెసిడెంట్‌లు వీళ్లే!

image

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కొత్తగా డీసీసీ ప్రెసిడెంట్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తవారికే అవకాశం ఇవ్వడం విశేషం. ఖైరతాబాద్‌కు యువ నాయకుడు మోత రోహిత్‌కు DCC బాధ్యతలు అప్పగించింది.
జిల్లాల వారీగా చూస్తే..
హైదరాబాద్: సయ్యద్ ఖలీద్ సైఫుల్లా
ఖైరతాబాద్: మోత రోహిత్ ముదిరాజ్
మేడ్చల్: తోటకూర వజ్రేశ్ యాదవ్
సికింద్రాబాద్: దీపక్ జాన్
వికారాబాద్: దారా సింగ్ యాదవ్

News November 22, 2025

వాస్తు ప్రకారం ఇంటికి ఏ రంగు ఉండాలి?

image

ఇంటికి లేత రంగులు (తెలుపు, లేత పసుపు) శ్రేయస్కరమని వాస్తు నిపుణలు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇవి ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని, చల్లదనాన్ని ఇస్తాయని తెలుపుతున్నారు. ‘చిన్న గదులు లేత రంగుల వలన విశాలంగా కనిపిస్తాయి. ఈ రంగులు సానుకూలతను, మానసిక ప్రశాంతతను పెంచుతాయి. రంగుల ఎంపికలో సౌలభ్యం, ఆనందకరమైన అనుభూతికి ప్రాధాన్యం ఇవ్వాలి. పెద్ద గదులకు డార్క్ రంగులైనా పర్లేదు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News November 22, 2025

బీసీలను ప్రభుత్వం నట్టేట ముంచింది: R.కృష్ణయ్య

image

TG: BCలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించి చివరికి ప్రభుత్వం నట్టేట ముంచిందని ఎంపీ R.కృష్ణయ్య మండిపడ్డారు. రిజర్వేషన్లపై సర్కార్ ఇవాళ జారీ చేసిన జీవో 46ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సూచించినట్లుగా ప్రస్తుత సామాజిక-రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేయకుండా, గదుల్లో కూర్చొని నివేదికలు సిద్ధం చేయడం బీసీలను రాజకీయంగా దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించారు.