News August 17, 2024
సైన్యం చేతిలో 80 మంది ఊచకోత

సూడాన్లోని ఓ గ్రామంలో పారామిలిటరీ బలగాలు 80 మందిని ఊచకోత కోశాయి. సిన్నార్ స్టేట్లోని జలక్ని గ్రామంలో ఈ ఘటన జరిగింది. తొలుత గ్రామానికి చెందిన యువతులను కిడ్నాప్ చేసేందుకు ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ప్రయత్నించగా గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో పారామిలటరీ బలగాలు రెచ్చిపోయి గ్రామంలో రక్తపాతం సృష్టించాయి. కనిపించిన వారిని కనిపించినట్లే కాల్చివేశారు. దీనిపై RSF ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
Similar News
News January 21, 2026
ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్న చాహల్, మహ్వాశ్!

భార్య ధనశ్రీతో విడాకుల తర్వాత IND క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ రేడియో జాకీ, ఇన్ఫ్లుయెన్సర్ RJ మహ్వాశ్తో రిలేషన్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా వీరి మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే SMలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారని సమాచారం. పలుమార్లు వీరిద్దరూ కలిసి కనిపించడం, IPL మ్యాచుల వేళ గ్రౌండ్లో చాహల్ను ఆమె ఎంకరేజ్ చేయడంతో డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
News January 21, 2026
రాజాసాబ్ ఫెయిల్యూర్కి అదే కారణం: తమ్మారెడ్డి

ప్రభాస్ ‘రాజాసాబ్’ను రూ.100 కోట్లతో రీజినల్ ఫిల్మ్గా తీసుంటే లాభాలు వచ్చేవని సీనియర్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. ‘ఈ మూవీని తొలుత తక్కువ బడ్జెట్లో తెలుగులో తీయాలనుకున్నారు. తర్వాత పాన్ ఇండియా ఆలోచనతో పదే పదే స్క్రిప్ట్ మార్చారు. దీంతో మొదట అసలు కథ తెరకెక్కలేదు. మేకర్స్కు పాన్ ఇండియా ఆలోచన వస్తే చేసే మార్పులు కొన్నిసార్లే సక్సెస్ ఇస్తాయి’ అని ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.
News January 21, 2026
స్మార్ట్ ఫోన్ యూజర్లకు త్వరలో కొత్త ఫీచర్!

గూగుల్ ఫొటోస్ యాప్లో మీడియా ఫైల్స్ బ్యాకప్ చేసినప్పుడు ఫోన్ ఛార్జింగ్ ఎక్కువగా అయిపోతుంటుంది. బ్యాక్గ్రౌండ్లో జరిగే సింకింగ్, ఆపరేషన్సే దీనికి కారణం. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఈ యాప్లో త్వరలో ‘ఆప్టిమైజ్ బ్యాకప్ ఫర్ బ్యాటరీ లైఫ్’ అనే ఫీచర్ రానుంది. ఇది అనవసరమైన సింకింగ్ను తగ్గించి బ్యాటరీ లైఫ్ను పెంచుతుంది. యాప్ ఓపెన్ చేసినప్పుడు లేదా ఫోన్ వాడనప్పుడు మాత్రమే బ్యాకప్ జరుగుతుంది.


