News December 31, 2024

83.45శాతం పెన్షన్ల పంపిణీ: ప్రభుత్వం

image

APలో పెన్షన్ల పంపిణీ ఉదయం నుంచి కొనసాగుతోంది. 63.77 లక్షల మందికి గానూ ఇప్పటివరకు 53.22 లక్షల మందికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్లు అందించారు. ఉదయం 10 గంటల వరకు 83.45శాతం పెన్షన్ల పంపిణీ పూర్తైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. జియో ట్యాగింగ్ ద్వారా ఇళ్ల వద్దే ఇస్తున్నారా? లేదా? అనేది ప్రభుత్వం పరిశీలిస్తోంది. అటు 2-3 నెలలుగా పెన్షన్లు తీసుకోని 50 వేల మందికి ఇవాళే పెన్షన్లు ఇస్తోంది.

Similar News

News September 15, 2025

రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా: అచ్చెన్న

image

AP: రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 18వ తేదీలోపు కృష్ణపట్నం పోర్ట్ ద్వారా 11,605, కాకినాడ ద్వారా 18,765, మంగళూరు ద్వారా 2,700, జైగడ్ పోర్ట్ ద్వారా 8,100 MT యూరియా రవాణా జరుగుతుందని వెల్లడించారు. YCP కావాలనే యూరియా సరఫరాపై అబద్ధాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. రైతులను భయపెట్టి ప్రయోజనం పొందాలన్న ప్రయత్నం విజయవంతం కాదని హితవు పలికారు.

News September 15, 2025

ప్రియుడితో నటి ఎంగేజ్‌మెంట్?

image

రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ రచిత్‌ సింగ్‌తో బాలీవుడ్ నటి హుమా ఖురేషీ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. యాక్టింగ్ కోచ్‌ అయిన రచిత్‌తో హుమా ఏడాదికి పైగా డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు పలు సందర్భాల్లో సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. ఈక్రమంలోనే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. వీటిపై హుమా స్పందించాల్సి ఉంది.

News September 15, 2025

ఈనెల 17న విశాఖలో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు ఈనెల 17న విశాఖలో పర్యటించనున్నారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11.15AMకి కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఆర్కే బీచ్ రోడ్డులో ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్లో పాల్గొంటారు. 12PMకు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌‌లో ప్రసంగిస్తారు. అనంతరం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్‌కు హాజరవుతారు. సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.