News December 31, 2024

83.45శాతం పెన్షన్ల పంపిణీ: ప్రభుత్వం

image

APలో పెన్షన్ల పంపిణీ ఉదయం నుంచి కొనసాగుతోంది. 63.77 లక్షల మందికి గానూ ఇప్పటివరకు 53.22 లక్షల మందికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్లు అందించారు. ఉదయం 10 గంటల వరకు 83.45శాతం పెన్షన్ల పంపిణీ పూర్తైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. జియో ట్యాగింగ్ ద్వారా ఇళ్ల వద్దే ఇస్తున్నారా? లేదా? అనేది ప్రభుత్వం పరిశీలిస్తోంది. అటు 2-3 నెలలుగా పెన్షన్లు తీసుకోని 50 వేల మందికి ఇవాళే పెన్షన్లు ఇస్తోంది.

Similar News

News January 14, 2025

ALERT.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: కన్యాకుమారి సమీపంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతిలో ఇవాళ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. నిన్న నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతితో సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. మరోవైపు ఉత్తర కోస్తాలో చలి తీవ్రత కొనసాగుతోంది.

News January 14, 2025

Way2News: 24 గంటలూ వార్తల ‘పండుగే’

image

‘ఈరోజు సంక్రాంతి సెలవు కారణంగా రేపు పేపర్ రాదు. పునర్దర్శనం గురువారం’ అని వార్తాపత్రికల్లో చదువుతుంటాం. ఈరోజు వార్తలను చదివేందుకు మీరు మరుసటి రోజు వరకు వేచిచూడాల్సిన పని లేదు. ఎప్పటిలాగే పండుగ నాడు కూడా Way2News ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. సెలవుల్లోనూ 24/7 బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, సినిమాలు, స్పోర్ట్స్, ఇంటర్నేషనల్ కంటెంట్ వస్తూనే ఉంటాయి.
*Way2News యూజర్లకు సంక్రాంతి శుభాకాంక్షలు

News January 14, 2025

నేడు మకరజ్యోతి దర్శనం

image

నేడు శబరిమలలో మకర జ్యోతి దర్శనమివ్వనుంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండడంతో కేరళ ప్రభుత్వం అదనపు భద్రతా సిబ్బందిని మోహరించింది. జ్యోతిని దర్శించుకునే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. జ్యోతి దర్శనం సాయంత్రం 6-7 గంటల మధ్య జరగనుంది. దీని కోసం లక్ష మందికిపైగా అయ్యప్ప భక్తులు వస్తారని అంచనా.