News October 22, 2024
టెట్ పరీక్షకు 86 శాతం మంది హాజరు

AP: రాష్ట్రంలో 17 రోజులుగా కొనసాగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) సోమవారంతో ముగిసింది. మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661(86.38శాతం) మంది పరీక్షలు రాశారు. పేపర్-2ఏ సాంఘిక శాస్త్రం, పేపర్-2బీ ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షల రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక ‘కీ’ ఈ నెల 23 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. ఈ నెల 25 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.
Similar News
News October 19, 2025
దీపావళి: దీపారాధనకు ఏ నూనె ఉత్తమం?

దీపారాధనకు ఆవు నెయ్యి, నువ్వుల నూనె శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. ‘ఆవు నెయ్యి ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నువ్వుల నూనెను సకల దేవతలు ఇష్టపడతారు. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన ఈ నూనె దుష్ఫలితాలు కలగనివ్వకుండా చేస్తుంది. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే దాంపత్యం అన్యోన్యం అవుతుంది. ఆవు నెయ్యిలో వేప నూనె కలిపి వెలిగిస్తే విజయం లభిస్తుంది. అయితే వేరుశెనగ నూనె వాడకూడదు’ అని సూచిస్తున్నారు.
News October 19, 2025
ఎన్నికల రోజు పెయిడ్ హాలిడే ఇవ్వకుంటే జరిమానా: ఈసీ

ఎన్నికలు జరిగే రోజు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వకపోతే జరిమానా విధిస్తామని యాజమాన్యాలను కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఉప ఎన్నికలు జరిగే సెగ్మెంట్లకూ ఇది వర్తిస్తుందని, ఎవరి వేతనాల్లోనూ కోత విధించరాదని సూచించింది. ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లోని ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నా పోలింగ్ రోజు ఈ ప్రయోజనం పొందడానికి అర్హులేనని చెప్పింది. దీనిపై రాష్ట్రాలు ఉత్తర్వులు ఇవ్వాలంది.
News October 19, 2025
ALERT: టపాసులు కాలుస్తున్నారా?

దీపావళి వచ్చిందంటే చిన్నా పెద్దా తేడా లేకుండా బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకోవడం సాధారణమే. అయితే పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆస్తమా, చర్మ సమస్యలు, అలర్జీస్ ఉన్న పిల్లలను ఇళ్ల నుంచి బయటకు వెళ్లనీయొద్దని సూచిస్తున్నారు. పొగ, దుమ్ము లంగ్స్పై ప్రభావం చూపుతాయని, సీరియస్ అలర్జిక్ రియాక్షన్స్కు దారి తీస్తాయంటున్నారు.