News May 18, 2024

ఆరో దశ బరిలో 889 మంది

image

లోక్‌సభ ఎన్నికల ఆరో దశలో మొత్తం 889 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 స్థానాల్లో మే 25న జరిగే పోలింగ్‌లో ఓటర్లు వీరి భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు. ఈ స్థానాలకు మొత్తం 1978 నామినేషన్లు దాఖలు కాగా ఉపసంహరణ తర్వాత 889 మంది బరిలో నిలిచారని ఈసీ పేర్కొంది. వాతావరణ కారణాలతో వాయిదా పడిన JKలోని అనంతనాగ్-రజౌరి స్థానానికి కూడా ఈ దశలోనే పోలింగ్ జరగనుంది.

Similar News

News December 7, 2025

వైజాగ్ పోర్టు రికార్డు.. 249 రోజుల్లో 60MMT

image

AP: విశాఖ పోర్టు సరుకు రవాణాలో రికార్డు సృష్టించింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్‌(2025-26)లో 249 రోజుల్లోనే 60M మెట్రిక్ టన్నుల సరుకును హ్యాండిల్ చేసింది. ఈ ఘనత సాధించడానికి గతేడాది 273రోజులు, 2023-24లో 275డేస్ పట్టింది. వాణిజ్యంలో జరుగుతున్న మార్పులు, మౌలిక వసతుల సవాళ్లను అధిగమించి, ప్రత్యామ్నాయ ట్రాన్స్‌పోర్ట్ మార్గాలపై దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమైనట్లు పోర్టు ఛైర్మన్ అంగముత్తు పేర్కొన్నారు.

News December 7, 2025

మగవారి కంటే ఆడవారికే చలి ఎందుకు ఎక్కువంటే?

image

సాధారణంగా పురుషులతో పోలిస్తే ఆడవారిలో చలిని తట్టుకొనే శక్తి తక్కువ. మహిళల్లో పురుషులతో పోలిస్తే కండర ద్రవ్యరాశి తక్కువగా ఉంటుంది. దీనివల్ల మహిళల్లో వేడి తక్కువగా విడుదల అవుతుందంటున్నారు నిపుణులు. అలాగే ప్రోజెస్టెరాన్ హార్మోన్, థైరాయిడ్, మెటబాలిజం తక్కువగా ఉండటం, స్త్రీలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే సామర్థ్యం ప్రభావితమవుతుందంటున్నారు.

News December 7, 2025

DRDOలో ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంటున్నారా?

image

<>DRDO<<>> యంగ్ సైంటిస్ట్ లాబోరేటరీ 5 ఇంటర్న్‌షిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 25వరకు అప్లై చేసుకోవచ్చు. B.TECH/M.TECH (ఎలక్ట్రానిక్స్&టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్), MSc ఫిజిక్స్, M.Tech ఫిజిక్స్ 3rd/ 4th సెమిస్టర్ చదువుతున్న వారు అర్హులు. నెలకు రూ.5వేల చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. దరఖాస్తును స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి.