News January 7, 2025
9 మంది RSS సభ్యులకు యావజ్జీవ శిక్ష
కేరళలో 19 ఏళ్ల క్రితం నాటి హత్య కేసులో 9 మంది RSS సభ్యులకు తలస్సేరి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. 2005 అక్టోబరు 3న కన్నాపురం చుండాకు చెందిన 25 ఏళ్ల CPM సభ్యుడు రిజిత్ శంకరన్ను రాజకీయ వర్గపోరు వల్ల RSS కార్యకర్తలు ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారు. మరో ముగ్గురిని తీవ్రంగా గాయపరిచారు. ఈ కేసులో జనవరి 4న నిందితులను దోషులుగా నిర్ధారించిన తలస్సేరి కోర్టు తాజాగా శిక్ష ఖరారు చేసింది.
Similar News
News January 19, 2025
దేశంతోనూ పోరాడుతున్నామన్న రాహుల్.. FIR ఫైల్
BJP, RSSతోపాటు దేశంతోనూ కాంగ్రెస్ పోరాడుతోందన్న లోక్సభ పక్షనేత రాహుల్ గాంధీపై మోన్జిత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో గువాహటి పోలీస్స్టేషన్లో ఆయనపై FIR నమోదైంది. రాహుల్ వ్యాఖ్యలు వాక్స్వాతంత్య్ర పరిమితులను దాటాయని, అవి జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తాయని మోన్జిత్ ఆరోపించారు. ఇటీవల ఢిల్లీలో INC కొత్త కార్యాలయ ప్రారంభోత్సవంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
News January 19, 2025
మా అమ్మకు పద్మ అవార్డు కోసం ఎంతో ప్రయత్నించా: నరేశ్
ఇండియాలో 46 సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళ విజయ నిర్మలకు పద్మ అవార్డు రాకపోవడంపై కొడుకు నరేశ్ విచారం వ్యక్తం చేశారు. అమ్మకు పురస్కారం కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. బీజేపీ వచ్చిన తర్వాత స్థాయి ఉన్న వ్యక్తులకు అవార్డులు ఇస్తున్నారని చెప్పారు. తెలుగు ఇండస్ట్రీలోనూ అలాంటి వారు ఉన్నారని, వారికి పురస్కారాల కోసం నిరాహార దీక్ష చేసినా తప్పులేదని వ్యాఖ్యానించారు.
News January 19, 2025
ఇండో-కొరియన్ హారర్ కామెడీ జోనర్లో వరుణ్ కొత్త చిత్రం
‘మట్కా’ డిజాస్టర్ తర్వాత వరుణ్ తేజ్ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. మేర్లపాక గాంధీ డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ మూవీ ఇండో కొరియన్ హారర్ కామెడీ జోనర్లో ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఇవాళ వరుణ్ బర్త్డే సందర్భంగా ఓ పోస్టర్ను విడుదల చేశారు. ‘కదిరి నరసింహసామి సాచ్చిగా ఈ తూరి నవ్వించేకి వస్తుండా’ అని మెగా ప్రిన్స్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తారు.