News April 25, 2024

93.5% మార్కులు.. మూర్ఛపోయిన విద్యార్థి

image

ఊహించిన దానికంటే ఎక్కువ మార్కులు వస్తే ఎగిరి గంతులు వేయడం కామన్. అయితే.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ స్టూడెంట్‌కి మాత్రం వింత అనుభవం ఎదురైంది. ఇటీవల UP SSC బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో టెన్త్ విద్యార్థి అన్షుల్ కుమార్‌(16)కు 93.5% మార్కులు వచ్చాయి. అయితే తనకు ఊహించినదానికంటే ఎక్కువ మార్కులు రావడంతో అతడు మూర్ఛపోయాడు. దీంతో అతడిని ICUలో చేర్చాల్సి వచ్చింది.

Similar News

News January 17, 2025

ఎంపీతో రింకూ సింగ్ ఎంగేజ్‌మెంట్

image

IND యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. UPకి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో తాజాగా ఆయన ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. దీంతో వీరికి సహచర క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రియా సరోజ్ ఇటీవల మచ్లిషహర్ సెగ్మెంట్ నుంచి 25 ఏళ్లకే ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె ఢిల్లీ వర్సిటీలో చదివి సుప్రీంకోర్టు లాయర్‌గా పనిచేశారు. తండ్రి 3 సార్లు ఎంపీగా గెలిచారు.

News January 17, 2025

BIG BREAKING: గ్రామ, వార్డు సచివాలయాల్లో భారీ మార్పులు

image

AP: 14వేలకు పైగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజిస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ‘గత ప్రభుత్వం వాటిలో 11 మంది చొప్పున సిబ్బందిని కేటాయించింది. ఇకపై 3,500+ జనాభా పరిధి ఉన్న సచివాలయంలో 8 మంది, 2,500+ ఉన్న చోట ఏడుగురిని, మిగతా వాటిలో ఆరుగురు సిబ్బందిని ఉంచుతాం. గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీ, పట్టణాల్లో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ హెడ్‌గా ఉంటారు’ అని పేర్కొన్నారు.

News January 17, 2025

ప్రకృతి విలయం నుంచి తేరుకునేందుకు దశాబ్దం!

image

అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌‌లో ఏర్పడిన కార్చిచ్చు వల్ల రూ.లక్షల కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ వినాశకర కార్చిచ్చు ప్రభావం నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఒక దశాబ్ద కాలం పట్టొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. దీనివల్ల మౌలిక సదుపాయాలు, గృహాలు & ప్రకృతికి విస్తృతమైన నష్టం వాటిల్లింది. పురోగతి క్రమంగా ఉన్నప్పటికీ, అధికారులు నగరాన్ని పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపాయి.