News December 6, 2024
ఆస్ట్రేలియా బ్యాటింగ్ చాలా బలహీనంగా ఉంది: మంజ్రేకర్

రెండో టెస్టులో భారత బౌలర్లే కీలకమని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ‘ఆస్ట్రేలియా బ్యాటింగ్ చాలా బలహీనంగా ఉంది. దాన్ని బట్టి చూస్తే భారత బౌలర్ల ప్రభావంతో మాచ్పై భారత్ పైచేయి సాధిస్తుంది. అయితే పింక్ బాల్ టెస్టులో రికార్డు బాగున్న నేపథ్యంలో కంగారూలు సిరీస్లో తిరిగి పుంజుకునేందుకు ఈ టెస్టు వారికి సదవకాశం’ అని పేర్కొన్నారు. ఈరోజు ఉదయం 9.30 గంటల నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.
Similar News
News March 5, 2026
ఫైనల్కు ఒక్క అడుగుదూరంలో..

T20WC: నేడు ముంబై వేదికగా భారత్ ఇంగ్లండ్తో సెమీస్లో తలపడనుంది. టీ20 ప్రపంచకప్ సెమీస్లో వరుసగా మూడోసారి ఇంగ్లండ్తో ఆడనుంది. 2022లో ఇంగ్లండ్, 2024లో భారత్ సెమీస్ విజేతలుగా నిలిచాయి. ఇక హెడ్ టు హెడ్లో భారత్దే పైచేయి. T20WC చరిత్రలో ఐదుసార్లు తలపడగా IND మూడుసార్లు గెలిచింది. 2024 మ్యాజిక్ను రిపీట్ చేసి మళ్లీ ఫైనల్ చేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాత్రి.7.00కు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
News March 5, 2026
నేడు షా సమక్షంలో నితీశ్ నామినేషన్?

బిహార్ సీఎం నితీశ్ కుమార్ నేడు కేంద్రహోంమంత్రి అమిత్ షా సమక్షంలో రాజ్యసభ నామినేషన్ వేసే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంటోంది. ఈరోజు NDA శ్రేణులతో భేటీకి షా బిహార్ రానున్నారు. ఈ సందర్భంగా BJP చీఫ్ నితిన్ నబీన్తో పాటు నితీశ్ కూడా షా సమక్షంలో నామినేషన్ వేస్తారని ప్రచారం సాగుతోంది. అయితే జేడీయూలో ఓ వర్గం ఇందుకు సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో బిహార్ రాజకీయాల్లో నెక్ట్స్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
News March 5, 2026
ఇరాన్పై US పోరు వెనుక మతం రంగు?

ఇరాన్పై దాడులను సమర్థించుకునే క్రమంలో US తమ సైనికులకు మతసిద్ధాంతాలను చొప్పిస్తున్నట్లు రిపోర్ట్స్ రావడం కలకలం రేపుతోంది. దాదాపు 40 యూనిట్ల నుంచి 110 ఫిర్యాదులు వచ్చినట్లు మిలిటరీ రిలీజియస్ ఫ్రీడమ్ ఫౌండేషన్ వెల్లడించింది. బైబిల్లో పేర్కొన్న అర్మాగెడ్డాన్ (చెడుపై దేవుడి పోరు)ను సృష్టించేందుకు ఇరాన్పై దాడి చేయమని ట్రంప్కు జీసస్ సందేశం పంపారని కమాండర్ అధికారులకు చెప్పినట్లు రిపోర్ట్ పేర్కొంది.


