News December 6, 2024
ఒకే రోజు ముగ్గురు స్టార్ క్రికెటర్ల బర్త్ డే

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వారికి విషెష్ చెబుతున్నారు. కాగా బుమ్రా, జడేజా ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్లో ఉన్నారు. ఈ టూర్కు అయ్యర్ ఎంపిక కాలేదు. అయ్యర్ ఇటీవల మంచి ఫామ్ కనబరుస్తున్నారు. కాగా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్లు కరుణ్ నాయర్, ఆర్పీ సింగ్ బర్త్ డేలు ఇవాళే కావడం విశేషం.
Similar News
News April 18, 2026
ప.గో : పెట్రోల్ బంకుల్లో జిమ్మిక్కులు…!

జిల్లాలోని పలు పెట్రోల్ బంకుల్లో సిబ్బంది జిమ్మిక్కులు చేస్తున్నారని సమాచారం. వాహనాల్లోకి పెట్రోల్ నింపకుండానే నిండినట్లుగా సొమ్ములు వసూలు చేసి, వాహనదారులు నిలదీస్తే కాళ్ల బేరానికి వస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. గురువారం రాత్రి పెంటపాడు (M) అలంపురం ఒక పెట్రోల్ బంకులో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. పెట్రోలు కొట్టించి బంకు కూడా దాటకుండానే వాహనం ఆగిపోవడంతో సిబ్బందిని నిలదీసినట్లు తెలిసింది.
News April 18, 2026
సోమవారం రెండో విడత శాంతి చర్చలు!

అమెరికా-ఇరాన్ రెండో విడత శాంతి చర్చలకు సిద్ధమయ్యాయి. అందుకు మరోసారి పాకిస్థాన్ను వేదికగా ఎంచుకున్నాయి. ఇస్లామాబాద్లో వచ్చే సోమవారం చర్చలు జరపనున్నట్లు సమాచారం. రేపు ఇరాన్ ప్రతినిధులు పాక్ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తొలి విడత చర్చలు విఫలమైన విషయం తెలిసిందే.
News April 18, 2026
పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.810 పెరిగి రూ.1,55,780కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.750 పెరిగి రూ.1,42,800గా ఉంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.5000 ఎగసి రూ.2,80,000కి చేరింది.


