News December 6, 2024
మళ్లీ ఆదుకున్న నితీశ్ రెడ్డి

పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ను ఆదుకున్న తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి, అడిలైడ్ టెస్టులోనూ ఆపద్బాంధవుడయ్యారు. 3 సిక్సులు, 3 ఫోర్లతో 54 బంతుల్లో 42 రన్స్ చేసి జట్టు స్కోరును 180 పరుగులకు చేర్చారు. పింక్ బాల్ స్వింగ్ అవుతుండటంతో మేటి బ్యాటర్లు చేతులెత్తేసినా నితీశ్ టాప్ స్కోరర్గా నిలవడం విశేషం. భారత్కు సరైన ఆల్రౌండర్ దొరికాడంటూ నెట్టింట నితీశ్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Similar News
News March 7, 2026
రేపు వరుణ్ ఆడతాడా? సూర్య రెస్పాన్స్ ఇదే..

T20 WC: టీమ్ఇండియా స్టార్ బౌలర్ వరుణ్ చక్రవర్తి ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. దీంతో ఫైనల్లో అతణ్ని తప్పిస్తారనే చర్చ జరుగుతోంది. దీనిపై కెప్టెన్ సూర్య స్పందించారు. ‘వరుణ్ ఫామ్పై మాకు ఆందోళన లేదు. ఇది టీమ్ స్పోర్ట్. అతని ఒక్కడి పర్ఫార్మెన్స్ గురించి ఆలోచించడం లేదు. అతడు వరల్డ్ నం.1 బౌలర్. టీమ్ను ఎలా గెలిపించాలో అతనికి తెలుసు’ అంటూ వరుణ్ను వెనకేసుకొచ్చారు. జట్టులో మార్పులు రేపే తెలుస్తాయన్నారు.
News March 7, 2026
‘సిగ్గుచేటు’.. బెంగాల్ ప్రభుత్వంపై మోదీ ఫైర్

బెంగాల్లోని TMC ప్రభుత్వంపై PM మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన రాష్ట్రపతి <<19322594>>ద్రౌపదీ ముర్ము<<>>ను అవమానించేలా బెంగాల్ యంత్రాంగం వ్యవహరించడం సిగ్గుచేటని, ఇది ప్రజాస్వామ్యానికే విఘాతమని విమర్శించారు. సంతాల్ సంస్కృతిని TMC ప్రభుత్వం చాలా చులకనగా చూస్తోందని ఆరోపించారు. రాష్ట్రపతి కార్యాలయం రాజకీయాలకు అతీతమని, ఆ పదవికి ఉన్న పవిత్రతను గౌరవించాలని హితవు పలికారు.
News March 7, 2026
నాలుగుసార్లు ప్రధాని.. చిత్తుగా ఓడిపోయారు

నేపాల్ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. ఆ దేశానికి నాలుగుసార్లు ప్రధానిగా పనిచేసిన కేపీ శర్మ ఓలీ(CPN-UML) సొంత నియోజకవర్గం జాఫా-5లో చిత్తుగా ఓడిపోయారు. ఆయనపై RSP అభ్యర్థి బాలేంద్ర షా 49,164 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక ఓవరాల్గా 165 స్థానాలకుగాను RSP 67 చోట్ల గెలిచింది. 55 సెగ్మెంట్లలో లీడింగ్లో ఉంది. మిగతా పార్టీలన్నీ సింగిల్ డిజిట్తో పోటీ పడుతున్నాయి.


