News December 6, 2024

బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు

image

AP: కాకినాడలో బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. దీనికి వినీత్ బ్రిజ్ లాల్‌ను ఛైర్మన్‌గా నియమించింది. బియ్యం అక్రమ రవాణాపై నమోదైన కేసులన్నింటినీ సిట్ విచారించనుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి కేసు విచారణలో పురోగతిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సిట్‌కు అవసరమైన సమాచారం ఇవ్వాలని డీజీపీ, హోం సెక్రటరీకి సీఎస్ నీరబ్ సూచించారు.

Similar News

News March 14, 2026

నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్

image

తెలంగాణలో నేటి నుంచి ఏప్రిల్ 13 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. 9.30AM-12.30PM వరకు 3 గంటల పాటు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. గంట ముందే సెంటర్‌కు చేరుకోవాలని, ఎగ్జామ్ ప్రారంభమైన 5 ని. తర్వాత కూడా అంటే 9.35AM వరకు లోపలికి అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది. మొత్తం 5,28,239 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచులు, కాలిక్యులేటర్లకు పర్మిషన్ లేదు.
All The Best

News March 14, 2026

సంక్షోభం ఉన్నా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచలేదు: BJP

image

ప్రపంచంలో ఇంధన సంక్షోభం నెలకొన్నా భారత్‌లో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగలేదని బీజేపీ ట్వీట్ చేసింది. హార్ముజ్ జలసంధి మూసివేతతో బ్యారెల్ ధర $100 దాటినా మోదీ ప్రభుత్వ ముందుచూపుతో దేశంలో రేట్లు పెరగలేదని తెలిపింది. ఇదే సమయంలో G20 దేశాల్లో 20% వరకు ఇంధన ధరలు పెరిగాయని వెల్లడించింది. దేశంలో 7-8 వారాలకు సరిపడా క్రూడాయిల్ నిల్వలు ఉన్నాయని, వివిధ దేశాల నుంచి ఆయిల్ దిగుమతి అవుతోందని వివరించింది.

News March 14, 2026

నిమ్మలో కొమ్మల కత్తిరింపు వల్ల లాభమేంటి?

image

అంటు కొమ్మలను నాటిన నిమ్మ మొక్కల వేరు మూలం నుంచి పెరిగే కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. కాండంపై 2 అడుగుల ఎత్తువరకు పక్క కొమ్మలు పెరగకుండా తీసేయాలి. చెట్టుకు ఉన్న అనవసర, ఎండు, తెగులు సోకిన కొమ్మ భాగాలను కత్తిరించి తీసేయాలి. కొమ్మ కత్తిరింపుల తర్వాత చెట్టుపై 1% బోర్డో మిశ్రమం లేదా కాపర్ఆక్సీక్లోరైడ్‌ను చెట్టుపై పిచికారీ చేయాలి. చెట్టు మొదలు నుంచి 1.5 అడుగుల ఎత్తు వరకు బోర్డో పేస్టును పూయాలి.