News December 6, 2024
బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు
AP: కాకినాడలో బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. దీనికి వినీత్ బ్రిజ్ లాల్ను ఛైర్మన్గా నియమించింది. బియ్యం అక్రమ రవాణాపై నమోదైన కేసులన్నింటినీ సిట్ విచారించనుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి కేసు విచారణలో పురోగతిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సిట్కు అవసరమైన సమాచారం ఇవ్వాలని డీజీపీ, హోం సెక్రటరీకి సీఎస్ నీరబ్ సూచించారు.
Similar News
News January 22, 2025
సైఫ్ ఇంట్లో సెక్యూరిటీ గార్డ్స్ నిద్రపోయారు: నిందితుడు
సైఫ్పై దాడి నిందితుడు షరీఫుల్తో పోలీసులు సీన్ రీక్రియేషన్ చేశారు. ‘అతడు ఇంట్లోకి ప్రవేశించేముందు షూ విప్పేసి, ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. కారిడార్లో సీసీ కెమెరా లేదని, సెక్యూరిటీ గార్డులు నిద్రపోతున్నట్లు చెప్పాడు. చోరీ చేసేందుకు సైఫ్ కొడుకు రూమ్లోకి ప్రవేశించగా పనిమనిషి తనను చూసి కేకలు వేసిందన్నాడు’ అని పోలీసులు తెలిపారు. తర్వాత సైఫ్ అతడిని పట్టుకునేందుకు చూడగా కత్తితో దాడి చేశాడని చెప్పారు.
News January 22, 2025
సైఫ్పై కత్తి దాడి: పోలీసు శాఖ ట్విస్ట్
యాక్టర్ సైఫ్ అలీఖాన్పై కత్తిదాడి కేసులో మరో ట్విస్ట్. మొదటి నుంచి దర్యాప్తు చేస్తున్న పోలీస్ ఆఫీసర్ పీఐ సుదర్శన్ గైక్వాడ్ను ఈ కేసు నుంచి తప్పించారు. ఆయన స్థానంలో అజయ్ లింగ్నూర్కర్ను నియమించారు. అధికారిని ఎందుకు మార్చారో పోలీసు పెద్దలు చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో చాలా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని, పురోగతేమీ కనిపించడం లేదని కొందరు పెదవి విరుస్తున్నారు.
News January 22, 2025
APలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లను ఏర్పాటు చేయండి: లోకేశ్
దావోస్ పర్యటనలో భాగంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ గ్లోబల్ ఛైర్ జాన్ డ్రూతో AP మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో WTCలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్ ఆసియాతో భారత మార్కెట్ను అనుసంధానించడానికి వీలుగా ఏపీలో ట్రేడ్ హబ్ను ప్రారంభించాలన్నారు. అటు దేశంలో 13 WTC సెంటర్లు పనిచేస్తున్నాయని, 7 నిర్మాణంలో ఉన్నాయని, ఏపీలో ఏర్పాటును పరిశీలిస్తామని జాన్ చెప్పారు.