News December 10, 2024

రాజ్యసభ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన ఇండియా కూటమి

image

రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్ష ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. దీనిపై 71 మంది ఎంపీలు సంతకాలు చేసినట్టు తెలిసింది. అదానీ అంశంపై కాంగ్రెస్‌తో దూరం పాటిస్తున్న తృణమూల్, సమాజ్‌వాదీ ఎంపీలూ సంతకాలు చేశారని సమాచారం. ప్రతిపక్ష సభ్యుల పట్ల ఆయన వ్యవహార శైలి బాగాలేదన్నది ప్రధాన ఆరోపణ. సభను తటస్థ వైఖరితో నిర్వహించడం లేదని, అధికార పక్షానికే అనుకూలంగా ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.

Similar News

News September 22, 2025

2028 నాటికి విశాఖ, విజయవాడ మెట్రోలు

image

AP: మెట్రో రైల్ టెండర్లలో గరిష్ఠంగా 3 కంపెనీల JVలకు అవకాశం కల్పిస్తున్నట్లు APMRCL MD రామకృష్ణారెడ్డి తెలిపారు. విశాఖ 46.23 కి.మీ, విజయవాడ 38 కి.మీల మేర పనుల్లో 40 శాతం సివిల్ వర్కులకు టెండర్లు పిలిచామన్నారు. OCT 10లోగా విశాఖకు, 14లోగా విజయవాడకు టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ రెండు మెట్రో ప్రాజెక్టులు రికార్డు టైమ్‌లో 2028 నాటికి పూర్తిచేయాలని లక్ష్యాన్ని పెట్టుకున్నామని వివరించారు.

News September 22, 2025

దసరా తర్వాత జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్?

image

TG: దసరా తర్వాత జూబ్లీహిల్స్ బైపోల్‌కు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ తొలివారంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల <<17788984>>డేట్స్<<>> ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దాంతో పాటు జూబ్లీహిల్స్ సహా దేశంలోని మరిన్ని నియోజకవర్గాలకు షెడ్యూల్ ప్రకటిస్తుందని సమాచారం. ఇప్పటికే ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలు, తదితర ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈసీకి పూర్తి నివేదిక సమర్పించారు.

News September 22, 2025

వ్యవసాయంలో ఎర పంటల ప్రాధాన్యం

image

కొన్ని రకాల పంటలు కొన్ని పురుగులను విపరీతంగా ఆకర్షిస్తాయి. ఆ పంటలను ప్రధాన పొలంలో వేస్తే పురుగు రాకను, ఉనికిని వెంటనే గుర్తించవచ్చు. అటువంటి పంటలను ఎరపంటలు లేదా ఆకర్షక పంటలు (Trap Crop) అంటారు. ఎరపంటలు వేయడం వల్ల ప్రధాన పంటపై పురుగుల ఉద్ధృతి తగ్గుతుంది. అలాగే పురుగుమందులు వాడాల్సిన అవసరం, వాటి కొనుగోలుకు పెట్టే ఖర్చు తగ్గుతుంది. రైతులు ఈ ఎర పంటల ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రధాన పంటలో వేసుకోవాలి.