News December 10, 2024
టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్: ఛైర్మన్

AP: భక్తుల పట్ల టీటీడీ ఉద్యోగులు బాధ్యత, అంకితభావంతో పనిచేసేలా కీలక నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ‘కొందరు ఉద్యోగులు భక్తులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఉద్యోగులందరికీ త్వరలోనే నేమ్ బ్యాడ్జ్ అందిస్తాం. దీని ద్వారా అమర్యాదగా వ్యవహరించే ఉద్యోగులను భక్తులు గుర్తించే అవకాశం ఉంటుంది’ అని Xలో బీఆర్ నాయుడు పోస్ట్ చేశారు.
Similar News
News September 22, 2025
నేటి నుంచి దుర్గా నవరాత్రులు.. బాలాత్రిపుర సుందరీగా అమ్మవారు

దేశవ్యాప్తంగా నేటి నుంచి దుర్గామాత నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై, వరంగల్లోని భద్రకాళి ఆలయాల్లో 11 రోజుల పాటు అమ్మవార్లు పలు అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు. ఇవాళ బాలా త్రిపుర సుందరీదేవీగా కనిపించనున్నారు. అటు శ్రీశైలంలో భ్రమరాంభికా దేవి శైలపుత్రి అలంకారంలో దర్శనమిస్తారు. కాగా నేడు 2-10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించడం ఆనవాయితీ.
News September 22, 2025
ఇవాళ విశాఖకు సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ వైజాగ్లో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు జరిగే జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సును ఆయన ప్రారంభిస్తారు. ఈ ఏడాది ‘సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్’ థీమ్తో ఈ కాంక్లేవ్ను నిర్వహిస్తున్నారు. AI, సైబర్ సెక్యూరిటీ, పౌర సేవలు, అగ్రి-స్టాక్ వంటి అంశాలపై చర్చించనున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ ఈ సదస్సుకు హాజరుకానున్నారు.
News September 22, 2025
పవన్ అభిమానులకు ఇంకా నిరీక్షణే..

పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ‘OG’ ఈ నెల 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. నిన్ననే ట్రైలర్ రావాల్సి ఉండగా పలు కారణాలతో రిలీజ్ కాలేదు. అయితే సినిమా విడుదలకు దగ్గర పడుతున్నా ట్రైలర్ రాకపోవడం ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ట్రైలర్ ఛాన్స్ ఉండటంతో రెండు రోజులు ముందు విడుదల చేస్తే ఎలా అని అంటున్నారు. ఇలాంటివి సరిగ్గా ప్లాన్ చేసుకోవాలని దర్శకనిర్మాతలకు సూచిస్తున్నారు.