News December 10, 2024
టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్: ఛైర్మన్
AP: భక్తుల పట్ల టీటీడీ ఉద్యోగులు బాధ్యత, అంకితభావంతో పనిచేసేలా కీలక నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ‘కొందరు ఉద్యోగులు భక్తులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఉద్యోగులందరికీ త్వరలోనే నేమ్ బ్యాడ్జ్ అందిస్తాం. దీని ద్వారా అమర్యాదగా వ్యవహరించే ఉద్యోగులను భక్తులు గుర్తించే అవకాశం ఉంటుంది’ అని Xలో బీఆర్ నాయుడు పోస్ట్ చేశారు.
Similar News
News January 21, 2025
‘నా భార్య టార్చర్ పెడుతోంది.. చనిపోతున్నా’
భార్య వేధింపులకు మరో భర్త బలయ్యాడు. ఇండోర్(MP)కు చెందిన నితిన్ ఆత్మహత్య చేసుకున్నాడు. విడాకులు తీసుకున్నా తన భార్య హర్ష, అత్త, భార్య సోదరీమణులు వేధిస్తున్నారని సూసైడ్ నోట్ రాశాడు. ‘మహిళలు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు. వాటిని మార్చాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా’ అని తెలిపాడు. యువకులు పెళ్లి చేసుకోవద్దని, ఒకవేళ చేసుకుంటే ముందే అగ్రిమెంట్ చేసుకోవాలని పేర్కొన్నాడు.
News January 21, 2025
బ్రాండ్ వాల్యూ పరంగా ప్రపంచంలో పెద్ద ఐటీ కంపెనీలు
*యాక్సెంచర్ (అమెరికా)- రూ.3.47 లక్షల కోట్లు
*టీసీఎస్ (భారత్)- రూ.1.77 లక్షల కోట్లు
*ఇన్ఫోసిస్ (భారత్)- రూ.1.36 లక్షల కోట్లు
*ఐబీఎం కన్సల్టింగ్ (అమెరికా)- రూ.85వేల కోట్లు
*NTT DATA (జపాన్)- రూ.83వేల కోట్లు
*క్యాప్జెమినీ (ఫ్రాన్స్)- రూ.82వేల కోట్లు
*కాగ్నిజెంట్ (అమెరికా)- రూ.75వేల కోట్లు
*HCL టెక్ (భారత్)- రూ.74వేల కోట్లు
*విప్రో (భారత్)- రూ.50వేల కోట్లు
*Fujitsu (జపాన్)- రూ.34వేల కోట్లు
News January 21, 2025
కల్లు గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు
AP: రాష్ట్రంలోని కల్లు, గీత కులవృత్తిదారులకు ప్రభుత్వం మద్యం దుకాణాలు కేటాయించింది. అన్ని జిల్లాలకు కలిపి మొత్తం 335 మద్యం షాపులు ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా నూతన మద్యం పాలసీ ప్రకారం ప్రభుత్వం రాష్ట్రంలో 3,396 వైన్ షాపులకు లైసెన్సులు జారీ చేసింది. ఇందులో 10 శాతం దుకాణాలను గీత కులాలకు కేటాయించింది.