News December 17, 2024

తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్లు.. ఎప్పుడు, ఎక్కడ?

image

AP: తిరుమలలో జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉండనున్నాయి. దానికి సంబంధించిన టికెట్ల వివరాలు..
*DEC 23న ఆన్‌లైన్‌లో ఉ.11 గం.కు శ్రీవాణి వీఐపీ టికెట్ల విడుదల
*DEC 24న ఆన్‌లైన్‌లో ఉ.11 గం.కు రూ.300 స్పెషల్ దర్శన టోకెన్ల విడుదల
*తిరుపతిలోని ఎం.ఆర్ పల్లి, జీవకోన, ఇందిరా మైదానం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో SSD టోకెన్ల కేటాయింపు

Similar News

News September 20, 2025

ఇక గ్రీన్ కార్డు కష్టమే గురూ..!

image

అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి ట్రంప్ షాక్ ఇచ్చారు. గ్రీన్ కార్డు రావాలంటే EB-3 క్యాటగిరీలోని స్కిల్డ్ వర్కర్లు, ప్రొఫెషనల్స్ 12 నుంచి 40 ఏళ్లు ఎదురుచూడాల్సి వస్తోంది. తాజాగా H1B వీసాల అప్లికేషన్ ఫీజును లక్ష డాలర్లకు పెంచారు. ప్రతి సంవత్సరం దాన్ని రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి రూ.88 లక్షలు చెల్లిస్తూ ఉంటేనే వీసా రెన్యూవల్ అయి గ్రీన్ కార్డు వస్తుంది.

News September 20, 2025

వచ్చే నెల నుంచి పత్తి కొనుగోళ్లు.. ఈ నంబర్లు సేవ్ చేసుకోండి

image

TG: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లను వచ్చే నెల నుంచి ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది 122 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులందరికీ మద్దతు ధర(దూది పింజ పత్తికి క్వింటాకు ₹8,110, తక్కువ దూది పింజ ఉంటే ₹7,710) లభించేలా అధికారులు పనిచేయాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 18005995779, వాట్సాప్ నంబర్ 8897281111లను సంప్రదించాలన్నారు.

News September 20, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.820 పెరిగి రూ.1,12,150కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.750 ఎగబాకి రూ.1,02,800 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.2000 పెరిగి రూ.1,45,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.