News December 18, 2024

INS నిర్దేశక్‌ జాతికి అంకితం

image

సర్వే నౌక ఐఎన్ఎస్ నిర్దేశక్‌ను కేంద్ర మంత్రి సంజయ్ సేథ్ జాతికి అంకితం చేశారు. ఇవాళ విశాఖపట్నం నేవల్ డాక్ యార్డులో ఇది జలప్రవేశం చేసింది. దీనిని హైడ్రోగ్రఫీ సర్వేలు, నేవిగేషన్ అవసరాల కోసం రూపొందించారు. అత్యాధునిక హైడ్రో, ఓషనోగ్రాఫిక్ పరికరాలతో దీనిని నిర్మించారు. ఇది 18 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. 110 మీటర్ల పొడవు ఉండే ఈ నౌక రెండు డీజిల్ ఇంజిన్ల సహకారంతో నడుస్తుంది.

Similar News

News November 14, 2025

వేంకటేశ్వరస్వామి: మీకు ఈ కథ తెలుసా?

image

తిరుమల సోపాన మార్గంలోని మోకాలి మెట్టు వద్ద రాతి పెట్టెలుంటాయి. అవే పద్మావతి అమ్మవారి 7 వారాల సార్లపెట్టెలని నమ్మకం. వివాహం తర్వాత శ్రీనివాసుడు, పద్మావతి కొండకు బయలుదేరారు. అప్పుడే స్వామివారికి ఇల్లాలున్న విషయం గుర్తొచ్చింది. దీంతో పద్మావతిని ‘కరివేపాకు తెచ్చావా?’ అని అడిగి, తిరిగి పంపాడు. అలా వెనక్కి వెళ్లి అమ్మవారు తిరుచానూరులో శిలగా మారారు. ఈ పెట్టెలు నగల కోసమేనని నమ్ముతారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News November 14, 2025

NMLలో 21 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

NTPC మైనింగ్ లిమిటెడ్(NML)లో 21పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి CA/CMA, ఇంజినీరింగ్ డిగ్రీ( ఎన్విరాన్‌మెంట్ ), పీజీ డిప్లొమా, MSc, ఎంటెక్, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్‌సైట్: https://nml.co.in/en/jobs/

News November 14, 2025

భారీ మెజారిటీ దిశగా ఎన్డీయే

image

బిహార్‌లో భారీ మెజారిటీ దిశగా ఎన్డీయే దూసుకుపోతోంది. ప్రస్తుతం వెల్లడైన ట్రెండ్స్‌లో 180+ సీట్లలో ముందంజలో ఉంది. ఎంజీబీ 59 సీట్లు, జేఎస్పీ 1, ఇతరులు 3 సీట్లలో లీడింగ్‌లో ఉన్నారు. జన్ శక్తి జనతాదళ్ నేత తేజ్ ప్రతాప్ 8,800 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. మహువా స్థానంలో 1500 ఓట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.