News December 18, 2024
INS నిర్దేశక్ జాతికి అంకితం

సర్వే నౌక ఐఎన్ఎస్ నిర్దేశక్ను కేంద్ర మంత్రి సంజయ్ సేథ్ జాతికి అంకితం చేశారు. ఇవాళ విశాఖపట్నం నేవల్ డాక్ యార్డులో ఇది జలప్రవేశం చేసింది. దీనిని హైడ్రోగ్రఫీ సర్వేలు, నేవిగేషన్ అవసరాల కోసం రూపొందించారు. అత్యాధునిక హైడ్రో, ఓషనోగ్రాఫిక్ పరికరాలతో దీనిని నిర్మించారు. ఇది 18 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. 110 మీటర్ల పొడవు ఉండే ఈ నౌక రెండు డీజిల్ ఇంజిన్ల సహకారంతో నడుస్తుంది.
Similar News
News April 17, 2026
సాయంత్రం 6 గంటల తర్వాత ఓటింగ్

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్సభలో ఓటింగ్ ఆలస్యం కానుంది. సా.4 గంటలకే ఓటింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ కేంద్రమంత్రి అమిత్ షా 6PMకు ఆ బిల్లులపై ప్రసంగించనున్నారు. షా స్పీచ్ తర్వాత ఓటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
News April 17, 2026
20న జేఈఈ మెయిన్ ఫలితాలు!

జేఈఈ మెయిన్-2026 ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. jeemain.nta.nic.inలో అప్లికేషన్ నంబర్, బర్త్ డేట్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ నెల 2 నుంచి 8 వరకు జరిగిన సెషన్-2 పరీక్షలకు దేశవ్యాప్తంగా 11 లక్షల మందికి పైగా హాజరయ్యారు. NIT, IITలలో ప్రవేశాల కోసం జేఈఈ ఎగ్జామ్స్ను రెండు దశల్లో నిర్వహిస్తారు.
News April 17, 2026
‘దుష్టచతుష్టయం’ అంటే ఎవరు?

ఎవరైనా నలుగురు కలిసి తప్పుడు కార్యాలు చేస్తున్నప్పుడు వారిని ‘దుష్టచతుష్టయం’తో పోలుస్తాం. రాజకీయాల్లో ఎక్కువగా ఈ పదాన్ని వాడుతుంటారు. మహాభారతంలోని దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడిని కలిపి దుష్టచతుష్టయం అని మహా కవి తిక్కన ఉద్యోగ పర్వంలో సంబోధించారు. ‘మాయా బజార్’ సినిమా ద్వారా ఈ పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మీ జీవితంలో ఇలా దుష్టచతుష్టయం ఎవరైనా ఉన్నారా? కామెంట్ చేయండి.
<<-se>>#EPICSAYINGS<<>>


