News December 18, 2024
కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్.. ఫ్యాన్స్కు షాకిచ్చిన 2024!

క్రికెట్ అభిమానులకు ఈ ఏడాది ఒకటి తర్వాత మరొకటి షాక్లు తగులుతున్నాయి. 2024లో ఇప్పటికే టీ20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజాలు రిటైర్మెంట్ ప్రకటించారు. శిఖర్ ధవన్ అన్ని ఫార్మాట్లకూ, దినేశ్ కార్తీక్ క్రికెట్కు గుడ్బై చెప్పారు. ఈరోజు లెజెండరీ ఆల్ రౌండర్ అశ్విన్ అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగారు. దీంతో ఈ ఏడాది క్రికెట్ ఫ్యాన్స్కు చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
Similar News
News September 20, 2025
రాష్ట్రంలో 9 పార్టీల తొలగింపు.. ఏవంటే?

TG: దేశవ్యాప్తంగా రెండో దశలో 474 రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం <<17762955>>తొలగించిన<<>> విషయం తెలిసిందే. ఈ జాబితాలో తెలంగాణ నుంచి 9 పార్టీలున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. లోక్సత్తా, ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్, ఆల్ ఇండియా బీసీ ఓబీసీ, బీసీ భారత దేశం, భారత్ లేబర్ ప్రజా పార్టీ, మహాజన మండలి, నవభారత్ నేషనల్, TG ప్రగతి సమితి, TG ఇండిపెండెంట్ పార్టీలు ఉన్నాయన్నారు.
News September 20, 2025
మహిళా ఈ-హాత్ స్కీమ్ గురించి తెలుసా?

కేంద్ర శిశు, మహిళాభివృద్ధి శాఖ మహిళా ఈ హాత్ పథకాన్ని పర్యవేక్షిస్తోంది. దీన్ని 2016లో ప్రారంభించారు. మహిళా ఈ-హాత్ ఒక ద్విభాషా మార్కెటింగ్ ప్లాట్ ఫామ్. మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక సంఘాలు, లాభాపేక్ష లేని సంస్థలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీనిలో 18 రకాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవచ్చు.
News September 20, 2025
రాజమహేంద్రవరం-తిరుపతి మధ్య విమాన సర్వీసులు

AP: రాజమహేంద్రవరం-తిరుపతి మధ్య OCT 1 నుంచి విమాన సర్వీసు ప్రారంభిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ తెలిపారు. తొలి సర్వీసు ఆ రోజు ఉ.9:25గంటలకు తిరుపతి నుంచి రాజమహేంద్రవరం వచ్చి, ఉ.10:15గంటలకు తిరిగి వెళ్తుంది. OCT 2 నుంచి వారానికి 3 రోజులు(మంగళ, గురు, శని) ఈ విమాన సర్వీసులు నడుస్తాయి. ప్రతి రోజూ తిరుపతిలో ఉ.7:40గంటలకు బయల్దేరి రాజమహేంద్రవరానికి వస్తుంది. తిరిగి ఉ.9:50 గంటలకు బయల్దేరుతుంది.