News December 18, 2024
SKLM: రూ.15 లక్షలు వేరే అకౌంట్లోకి.. తిరిగి అందించిన పోస్టల్ సిబ్బంది

అరసవిల్లికి చెందిన ప్రసాదరావు అనే వ్యక్తి తన బ్యాంకు అకౌంట్లో దాచుకున్న సుమారు రూ.15 లక్షలను పోస్ట్ ఆఫీస్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయించారు. అయితే ఆ నగదు సాంకేతిక లోపంవల్ల ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి ఖాతాలోకి జమ అయ్యాయి. కాగా పోస్టల్ సిబ్బంది అంబుడ్సమన్ ద్వారా ఆ నగదును తిరిగి కస్టమర్ అకౌంట్లోకి క్రెడిట్ అయ్యేలా చేశారు. దీంతో పోస్ట్ మాస్టర్ రంగారావుకి కస్టమర్ సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News January 7, 2026
శ్రీకాకుళం: యువకుడిపై పోక్సో కేసు.. రిమాండ్

శ్రీకాకుళం నగరానికి చెందిన నవీన్ అనే యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు శ్రీకాకుళం 1 టౌన్ ఎస్ఐ హరికృష్ణ మంగళవారం తెలిపారు. నగరానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్లు విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
News January 7, 2026
ఆగని భోగాపురం మంటలు.. మీ కామెంట్

భోగాపురం ఎయిర్ పోర్ట్ క్రెడిట్ విషయంలో TDP, YCP నేతల మధ్య మాటల మంటలు ఆరడం లేదు. తమ ప్రభుత్వంలో విమానాశ్రయానికి పూర్తి అనుమతులు తెచ్చామని YCP నేతలు గట్టిగా చెప్తున్నారు. YCP హయాంలోనే 2,200 ఎకరాల్లోని అడ్డంకులు తొలగించి ప్రాజెక్టును పట్టాలెక్కించామంటున్నారు. ఈ వ్యాఖ్యలను TDP కొట్టిపారేస్తోంది. ఎర్ర బస్సు రాని గ్రామానికి ఎయిర్ బస్ తీసుకువచ్చిన ఘనత తమదని, ప్రాజెక్టును పూర్తి చేశామని అంటోంది.
News January 7, 2026
8న అరసవల్లిలో కర్టెన్ రైజర్

అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో జనవరి 19 నుంచి 25వ తేదీ వరకు రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులుతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈనెల 9న ఉదయం 8గంటలకు కర్టెన్ రైజర్తో వేడుకలకు అంకురార్పణ చేస్తామన్నారు.


