News December 20, 2024
ఓర్వకల్లు పార్కులో రూ.14వేల కోట్ల పెట్టుబడులు: మంత్రి భరత్

AP: రాయలసీమలోని ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కుకు భారీ పెట్టుబడి రాబోతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ట్వీట్ చేశారు. సెమీ కండక్టర్ రంగంలో రూ.14వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. దీని వల్ల పారిశ్రామిక వృద్ధితో పాటు ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నాయకత్వంలో రాయలసీమను ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
Similar News
News September 21, 2025
ఏసీల ధరలు రూ.4,500 వరకు తగ్గింపు

GST శ్లాబుల మార్పుతో ఏసీలు, డిష్ వాషర్ల ధరలను తగ్గిస్తున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. ఏసీలపై సగటున రూ.4,500, డిష్ వాషర్లపై రూ.8వేల వరకు రేట్లు తగ్గిస్తున్నట్లు వోల్టాస్, డైకిన్, గోద్రేజ్, పానాసోనిక్, Haier తదితర కంపెనీలు ప్రకటించాయి. LG 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC ధర రూ.3,600 తగ్గింది. డైకిన్ 1 టన్ 3 స్టార్ ఏసీ ధర రూ.50,700 నుంచి రూ.46,730కి తగ్గింది. రేపటి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.
News September 21, 2025
పూలు పులకరించే సమయం

దేవతలకు పుష్పార్చన చేయడం సర్వసాధారణం. కానీ ఆ పూవులనే దేవతలుగా కొలచి ఆరాధించే అదృష్టం ‘బతుకమ్మ’ ద్వారా మనకు దక్కింది. ఈ లోకంలో పూలను పూజించే ఏకైక పండుగ ఇదే. ప్రకృతితో మమేకమై, పూల పవిత్రతను ఆరాధించే ఈ ఆచారం మన ఆధ్యాత్మిక అనుబంధానికి ఓ తార్కాణం. తెలంగాణ సంస్కృతికి నిదర్శనం. పూజలో వాడిన పూలే ఎంతో పులకరిస్తాయంటే.. పూజలందుకొని గంగమ్మను చేరే తంగేడు, గునుగు వంటి పూలు ఇంకెంత పరవశించునో కదా!
News September 21, 2025
అమ్మవారిని మేల్కొలిపిన పూల పండుగే ‘బతుకమ్మ’

దుర్గాదేవి మహిషాసుర సంహారం తర్వాత అలసి నిద్రలోకి జారుకోగా, భక్తులు ఆమెను మేల్కొల్పడానికి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభించారని పండితులు చెబుతున్నారు. గౌరీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన పూలను భక్తులు ఒకచోట పేర్చి ఆమె కోసం ఆరాధనలు, సంకీర్తనలు చేసి, వేడుకున్నారని ప్రతీతి. ఈ భక్తి, అంకితభావానికి మెచ్చి అమ్మవారు మేల్కొన్నారని, అలా బతుకమ్మ పండుగ ఉద్భవించిందని నమ్ముతారు.