News December 20, 2024
విద్యార్థులకు న్యూ ఇయర్ కానుక

AP: ఇంటర్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జనవరి నుంచి మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అదే ప్రాంగణంలో కలిసి ఉన్న లేదా సమీపంలోని హైస్కూళ్ల నుంచి మధ్యాహ్న భోజనం పంపనున్నారు. అలాగే పిల్లల్లో నైతిక విలువలు పెంచేలా ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుతో ప్రత్యేకంగా పుస్తకాలు రూపొందించనున్నారు.
Similar News
News September 21, 2025
రేపటి నుంచి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు

AP: శ్రీశైలం మహాక్షేత్రంలో రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నారు. రేపు ఉ.9 గంటలకు అమ్మవారి ఆలయ యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మహర్నవమి సందర్భంగా అక్టోబర్ 1న ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొంటారు. అక్టోబర్ 2 దసరా రోజున తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.
News September 21, 2025
BCCI కొత్త అధ్యక్షుడు ఇతడేనా?

జమ్మూకశ్మీర్కు చెందిన మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడి రేసులో ముందున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. రోజర్ బిన్నీ తర్వాత ఇతడికే పదవి దక్కే ఛాన్స్ ఉంది. ఇవాళ ఢిల్లీలో జరిగే వార్షిక సమావేశంలో కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నారు. ఢిల్లీ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన మిథున్ 9వేలకు పైగా రన్స్ చేశారు. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు. IPL(2008-14)లో ఆడిన తొలి J&K ప్లేయర్గా నిలిచారు.
News September 21, 2025
మండోదరి పాత్రలో పూనమ్.. వ్యతిరేకిస్తున్న BJP, VHP!

ఢిల్లీలో జరిగే ‘రామ్లీల’ ఈవెంట్లో రావణుడి భార్య మండోదరి పాత్రలో నటించేందుకు పూనమ్ పాండేను తీసుకోవడంపై స్థానిక BJP, VHP నేతలు అభ్యంతరం తెలిపారు. ఆమెను మరొకరితో రీప్లేస్ చేయాలని లవ్కుశ్ రామ్లీల కమిటీని కోరారు. పూనమ్ తన ఫొటోలు, వీడియోలతో ఎన్నో కాంట్రవర్సీలు క్రియేట్ చేశారని గుర్తుచేశారు. అయితే ఇందులో తమకు ఏ తప్పూ కనిపించలేదని, ప్రతి ఒక్కరూ అవకాశం పొందేందుకు అర్హులని కమిటీ ప్రెసిడెంట్ బదులిచ్చారు.