News December 25, 2024

ఎస్.రాయవరం: పేకాట ఆడుతూ పట్టుబడిన మహిళలు

image

ఎస్.రాయవరం మండలం సీతారాంపురంలో పేకాట శిబిరంపై పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉండడం విశేషం. ఎస్ఐ విభీషణరావు ఆధ్వర్యంలో మహిళ కానిస్టేబుల్‌తో కలిసి నిర్వహించిన దాడుల్లో రూ.67 వేల నగదు, 10 మొబైల్ ఫోన్లు, ఏడు బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News April 18, 2026

విశాఖ-మహబూబ్‌నగర్ రైళ్ల పాక్షిక రద్దు

image

సికింద్రాబాద్-డోన్ సెక్షన్ పరిధిలోని మహబూబ్‌నగర్ – మన్యంకొండ మధ్య రైల్వే డబ్లింగ్ పనుల కారణంగా విశాఖ – మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ను పాక్షికంగా రద్దు చేశారు. ఈ నెల 18 నుంచి 20 వరకు విశాఖలో బయలుదేరే రైలు (12861) జడ్చర్ల వరకే నడుస్తుంది. అలాగే 19 నుంచి 21 వరకు మహబూబ్‌నగర్ రైలు (12862) జడ్చర్ల నుంచే తిరుగు ప్రయాణం కానుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలనీ సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు.

News April 18, 2026

విశాఖ – షాలిమార్ మధ్య స్పెషల్ రైలు

image

వేసవి రద్దీ దృష్ట్యా విశాఖపట్నం – షాలిమార్ మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. రైలు (08504) ఏప్రిల్ 22న రాత్రి 11:45కు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (08505) ఏప్రిల్ 23న సాయంత్రం 6 గంటలకు షాలిమార్ నుంచి బయలుదేరుతుందని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. పవన్ కుమార్ తెలిపారు.

News April 18, 2026

విశాఖలో ఒక్కరోజే 2,430 కేసులు నమోదు

image

విశాఖలోని శుక్రవారం ఒక్కరోజే 2,430 కేసులు నమోదు చేశారు. వాటి వివరాలిలా ఉన్నాయి. హెల్మెట్ ధరించనని-1,137, పిలియన్ రైడర్-223, ట్రిపుల్ రైడింగ్- 82, ఓవర్ స్పీడ్-220, సెల్ఫోన్ డ్రైవింగ్-28, డ్రైవింగ్ లైసెన్స్ లేనివి-15, మైనర్ డ్రైవింగ్ 03, రాంగ్ పార్కింగ్-180, డ్రంకన్ డ్రైవింగ్-35, సీజ్ అయిన వెహికల్స్-43, ఎంవీ యాక్ట్ ఉల్లంఘన-547 కేసులు ట్రాఫిక్ పోలీసులు నమోదు చేయగా 20 బస్సులు తనిఖీ చేశారు.