News March 16, 2024
శ్రీకాకుళం: అంతరాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ఠ నిఘా

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అంతరాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ తెలిపారు. ఒడిశా సరిహద్దు వెంబడి దాదాపు 112 కి.మీ మేర శ్రీకాకుళం జిల్లా ఉందని, ఇరు రాష్ట్రాల మధ్య జిల్లా వెంబడి 52 రహదారుల ద్వారా రాకపోకలు జరుగుతున్నాయని వీటిలో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇవి కాకుండా నిరంతరం పెట్రోలింగ్ బృందాలు తిరుగుతున్నాయని అన్నారు.
Similar News
News March 12, 2026
శ్రీకాకుళం: ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో ఆరుగురు డిబార్

శ్రీకాకుళం జిల్లాలోని ఆరు కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం స్క్వాడ్ పరిశీలనలో కాపీయింగ్ చేస్తున్న ఆరుగురిని డిబార్ చేసినట్లు డీఈవో ఎ.రవి బాబు చెప్పారు. 866 మంది విద్యార్థులకు 755 మంది హాజరు కాగా 111 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణను సిట్టింగ్ స్క్వాడ్లు పర్యవేక్షిస్తున్నాయననారు.
News March 12, 2026
శ్రీకాకుళం: ఏళ్లు గడిచినా కేసు తేలదా..ఎదురు చూపులేనా?

శ్రీకాకుళం జిల్లా రైతులకు వంశధార నీటి కష్టాలు ఈ ఏటా తప్పేలా లేవన్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఏర్పాటైన కాలువల షట్టర్లు కొన్ని శిథిలావస్థకు, మరికొన్ని పాడయ్యాయి. ఎగువ నీరు వృథాగా పోతుండడంతో ఆస్థానంలో తాత్కాలిక కర్రచెక్కలు, ఇతర సామగ్రి అడ్డుగా చేరాయి. వాటిని నేటికీ సరి చేయక పోలాలకు నీరు చేరదనట్లు అనిపిస్తోంది. దీని నిర్వహణకు 2007లో కేటాయించిన నిధుల అవకతవకల కేసు CBI పరిధిలో ఉంది.
News March 12, 2026
ఎచ్చెర్ల: ఐఐఐటీ కొత్త ఇన్ఛార్జ్ డైరక్టర్ ఎవరంటే?

శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఐఐఐటీ) ఇన్ఛార్జ్, డైరెక్టర్గా రిజిస్ట్రార్ అమరేంద్ర కుమార్ను నియమిస్తూ ఇన్ఛార్జ్, ఛాన్సలర్ మధుమూర్తి బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుత డైరెక్టర్ కొక్కిరాల వెంకట గోపాల ధన బాలాజీని రిలీవ్ చేస్తూ ఓ ప్రకటన చేశారు.


