News December 27, 2024

కాలువ‌లో ప‌డిన బ‌స్సు.. 8 మంది మృతి

image

పంజాబ్‌లోని బ‌ఠిండాలో ఓ బ‌స్సు కాలువ‌లోకి దూసుకెళ్లిన ఘ‌ట‌న‌లో 8 మంది మృతి చెందారు. స్థానిక MLA జ‌గ్పూర్ సింగ్ గిల్ తెలిపిన వివ‌రాల మేర‌కు వంతెన‌పై రెయిలింగ్‌ను ఢీకొన‌డంతో బ‌స్సు కాలువ‌లో పడిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు అక్క‌డికక్క‌డే మృతి చెంద‌గా, మ‌రో ముగ్గురు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్టు ఆయ‌న తెలిపారు. 18 మంది ప్ర‌యాణికులు షాహిద్ భాయ్ మ‌ణిసింగ్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

Similar News

News February 5, 2025

పంచాయతీ ఎన్నికలకు వారంలో నోటిఫికేషన్?

image

తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలుకానుంది. కులగణన, జనాభా ఆధారంగా వారికి రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం స్పష్టతకు రావడంతో మరో వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం స్పందించకపోయినా, పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ చెప్పారు. దీంతో ఎన్నికల నిర్వహణకు ఎక్కువ టైం పట్టదంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

News February 5, 2025

మేడారంలో ఇవాళ్టి నుంచి శుద్ధి కార్యక్రమాలు

image

TG: ములుగు(D) తాడ్వాయి(మ) మేడారం మినీ జాతరకు సిద్ధమవుతోంది. ఇవాళ్టి నుంచి సమ్మక్క-సారలమ్మకు పూజలు ప్రారంభం కానున్నాయి. కన్నెపల్లిలో సారలమ్మ, మేడారంలోని సమ్మక్క ఆలయాల్లో అర్చకులు శుద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయాల్లోని పూజా సామగ్రిని శుద్ధి చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. దేవతల పీటలను శుభ్రం చేసి, ముగ్గులతో సుందరంగా అలంకరిస్తారు. ఈ నెల 12 నుంచి 15 వరకు మినీ జాతర వేడుకలు నిర్వహిస్తారు.

News February 5, 2025

ఉమ్మితే భారీ జరిమానా.. బెంగాల్ యోచన

image

పొగాకు, పాన్ మసాలా నమిలి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడం పశ్చిమ బెంగాల్‌లోని ప్రధాన సమస్యల్లో ఒకటి. దీన్ని అడ్డుకునేందుకు ఆ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకోనుంది. బహిరంగప్రాంతాల్లో ఉమ్మేవారిపై అత్యంత భారీగా జరిమానాలు విధించేలా ఓ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఇలాంటి చట్టం ఉన్నప్పటికీ భారీ మార్పులు, జరిమానాతో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

error: Content is protected !!