News December 29, 2024
పాక్ చేతిలో భారత టెస్టు ఛాంపియన్షిప్ భవిష్యత్తు

భారత్ టెస్టు ఛాంపియన్షిప్ అర్హత ఇప్పుడు పాక్ చేతిలో ఉంది. PAKvsSA మ్యాచ్లో ఆఖరి ఇన్నింగ్స్లో 148 పరుగుల లక్ష్యంతో దక్షిణాఫ్రికా బరిలోకి దిగింది. మూడోరోజు స్టంప్స్ సమయానికి ఆ జట్టు స్కోరు 27/3గా ఉంది. మిగిలిన 121 రన్స్ చేస్తే టెస్టు ఛాంపియన్ షిప్కి సౌతాఫ్రికా అర్హత సాధిస్తుంది. ఆస్ట్రేలియాకు ఇంకా 2 టెస్టులు శ్రీలంకతో ఉన్న నేపథ్యంలో సౌతాఫ్రికా ఓడితేనే భారత్కు ఫైనల్కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది.
Similar News
News November 11, 2025
రాష్ట్రమంతా చూస్తోంది.. ఓటేద్దాం పదండి!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోలింగ్ <<18256499>>శాతం<<>> నిరాశపరుస్తోంది. బస్తీల నుంచి పోలింగ్ బూత్లకు కొంతమేర ఓటర్లు వస్తున్నప్పటికీ ధనికులుండే కాలనీల వారు ఆసక్తి చూపడం లేదు. ఓటు వేయకుంటే అభివృద్ధి, సమస్యల గురించి ప్రశ్నించే హక్కు ఉండదని ప్రజలు గ్రహించట్లేదు. ఈ నిర్లక్ష్యం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతమని విశ్లేషకులు చెబుతున్నారు. యువతరం ఇప్పటికైనా మేల్కొని తమ పౌర బాధ్యతను నిర్వర్తించాలి. *ఓటేద్దాం పదండి
News November 11, 2025
రూ.250 కోట్లలో జగన్ వాటా ఎంత: TDP

AP: టీటీడీకి 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని TDP ట్వీట్ చేసింది. దాని విలువ రూ.240.80 కోట్లు అంటే సుమారు రూ.250 కోట్ల కుంభకోణం జరిగినట్లు వివరించింది. ‘ఇందులో జగన్ వాటా ఎంత? జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి వాటా ఎంత? అసలు ఇది కమీషన్ కోసమే జరిగిందా? ఇంకేదైనా కుట్ర ఉందా?’ అని ట్వీట్ చేసింది. రెండేళ్ల పాటు లడ్డూ పవిత్రత దెబ్బతిందని, ఇది పాపం కాదా? అని ప్రశ్నించింది.
News November 11, 2025
IIIT కళ్యాణిలో ఉద్యోగాలు

<


