News December 29, 2024

పాక్ చేతిలో భారత టెస్టు ఛాంపియన్‌షిప్ భవిష్యత్తు

image

భారత్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ అర్హత ఇప్పుడు పాక్ చేతిలో ఉంది. PAKvsSA మ్యాచ్‌లో ఆఖరి ఇన్నింగ్స్‌లో 148 పరుగుల లక్ష్యంతో దక్షిణాఫ్రికా బరిలోకి దిగింది. మూడోరోజు స్టంప్స్ సమయానికి ఆ జట్టు స్కోరు 27/3గా ఉంది. మిగిలిన 121 రన్స్ చేస్తే టెస్టు ఛాంపియన్ షిప్‌కి సౌతాఫ్రికా అర్హత సాధిస్తుంది. ఆస్ట్రేలియాకు ఇంకా 2 టెస్టులు శ్రీలంకతో ఉన్న నేపథ్యంలో సౌతాఫ్రికా ఓడితేనే భారత్‌కు ఫైనల్‌కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది.

Similar News

News July 11, 2025

శ్రీశైలం నీళ్లు ఎలా వాడుకుంటారో తెలుసా?

image

శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ, తెలంగాణకు నీరందుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కులను రాయలసీమకు తరలించొచ్చు. తెలుగు గంగ, గాలేరు-నగరి కాలువల ద్వారా కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు నీరందుతోంది. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకంతో అనంతపురం, చిత్తూరుకు నీరు వెళ్తోంది. అటు తెలంగాణ కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా లబ్ధి పొందుతోంది.

News July 11, 2025

ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

image

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <>ఆధార్ వెబ్‌సైట్‌లో<<>> ఆధార్ నంబర్, క్యాప్చా, OTPతో లాగిన్ అవ్వాలి. LOCK/ UNLOCK ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసి బయోమెట్రిక్స్ తాత్కాలిక/పర్మినెంట్‌ లాక్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. CONSENT బాక్స్‌పై క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ నొక్కితే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. SHARE IT

News July 11, 2025

జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

image

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్‌షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్‌పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.