News March 16, 2024

బొత్స కుటుంబం నుంచి ముగ్గురు పోటీ

image

AP: విజయనగరం జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల్లో మంచి పట్టున్న నాయకుడు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈసారి ఆయన కుటుంబం నుంచి YCP తరఫున ముగ్గురు బరిలోకి దిగుతున్నారు. బొత్స చీపురుపల్లిలో పోటీ చేస్తుండగా.. ఆయన తమ్ముడు అప్పలనర్సయ్య మరోసారి గజపతినగరంలో పోటీ చేస్తున్నారు. కీలకమైన విశాఖ MP సీటులో బొత్స సతీమణి ఝాన్సీలక్ష్మి బరిలో ఉన్నారు. గతంలో ఆమె జడ్పీ ఛైర్‌పర్సన్‌గా, బొబ్బిలి, విజయనగరం MPగాను పని చేశారు.

Similar News

News August 25, 2025

విద్యార్థుల ముందస్తు అరెస్ట్ పిరికిపంద చర్య: హరీశ్ రావు

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన సందర్భంగా విద్యార్థుల ముందస్తు అరెస్టులు పిరికిపంద చర్య అని మాజీ మంత్రి హరీశ్ రావు అభివర్ణించారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క విద్యార్థిపై లాఠీ దెబ్బ పడినా తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. సీఎం రేవంత్ ఎమర్జెన్సీ రోజులను తిరిగి తెచ్చారని ధ్వజమెత్తారు. ఉద్యోగాల పేరిట మోసం చేసిన ఆయన OU విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

News August 25, 2025

ALL TIME RECORDకి చేరిన వెండి ధరలు

image

వెండి ధరలు క్రమంగా పెరుగుతూ ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. ఇవాళ కిలో వెండిపై రూ.1,000 పెరిగి తొలిసారి రూ.1,31,000ను తాకింది. గత 5 రోజుల్లో రూ.6,000 పెరగడం గమనార్హం. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,01,510కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.100 పతనమై రూ.93,050 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News August 25, 2025

పట్టుదలతోనే పురోగతి: గోయెంకా

image

లక్ష్యసాధనలో ఉన్నవారిని ప్రోత్సహించేలా వ్యాపారవేత్త హర్ష గోయెంకా చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘ఓ పని మొదలు పెట్టినప్పుడు అది వెంటనే సక్సెస్ అవ్వకపోవచ్చు. మళ్లీ ప్రయత్నించండి. ఒకటి రెండు సార్లు ప్రయత్నించినా రాకపోతే మీ పద్ధతిని మార్చుకోండి. ఇదొక నిరంతర ప్రక్రియ. సమస్య ఉంటే సాయం కోరండి. ఎవరూ చేయకపోతే మీ అనుభవంతో నేర్చుకోండి. పట్టుదలతోనే పురోగతి సాధ్యం. వదిలేయడమే ఓటమికి ఏకైక మార్గం’ అని రాసుకొచ్చారు.