News March 16, 2024

సూర్యాపేట: కారు, ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి

image

కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో గరిడేపల్లి మండలం మర్రికుంట దగ్గర జరిగింది. ఈ ప్రమాదంలో మట్టంపల్లి మండలం బిల్లా నాయక్ తండాకు చెందిన నవీన్ మృతి చెందాడు. గరిడేపల్లి నుండి సూర్యాపేట వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News August 20, 2025

NLG: ఇక గ్రామాల్లో ఉపాధి జాతర..!

image

జిల్లాలోని అన్నీ గ్రామాల్లో ఉపాధి హామీ పనుల జాతర చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రజలను భాగస్వామ్యం చేస్తూ, ‘పనుల జాతర -2025’ లో భాగంగా ఈనెల 22న ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. రూ. 3750.86 లక్షలతో 3918 పనులకు అనుమతులు ఇచ్చినట్లు డీఆర్డీఓ వై. శేఖర్ రెడ్డి తెలిపారు.

News August 20, 2025

జిల్లాలో యూరియాకు కొరత లేదు: కలెక్టర్ ఇలా

image

నల్గొండ జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లాకు వచ్చిన 510 మెట్రిక్ టన్నుల యూరియాను అవసరం ఉన్న రైతులకే పంపిణీ చేయాలని, పంపిణీలో ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డపేరు రాకుండా చూసుకోవాలని ఆమె వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆమె మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి డివిజన్ పరిధిలోని వ్యవసాయ అధికారులతో సమీక్షించారు.

News August 20, 2025

NLG: నల్గొండ జిల్లాలో 45% అధిక వర్షం

image

జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు సాధారణం కంటే 45 శాతం అధిక వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాలతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో 20 రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. జులై చివరి వరకు జిల్లాలో లోటు వర్షపాతం నమోదవగా.. ఆగస్టు తొలి వారం నుంచి జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురిసి అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఇప్పటివరకు 399 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.