News December 31, 2024
Stock Market: చివరి సెషన్ నష్టాలతో ఆరంభం

2024లో చివరి ట్రేడింగ్ సెషన్ను బెంచ్ మార్క్ సూచీలు నష్టాలతో ఆరంభించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 463 పాయింట్ల నష్టంతో 77,784 వద్ద, నిఫ్టీ 102 పాయింట్లు కోల్పోయి 23,542 వద్ద కదులుతున్నాయి. ఐటీ షేర్లు అత్యధికంగా 2% నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. కీలకమైన బ్యాంకు, ఫైనాన్స్, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలపై అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ONGC, BEL గ్రీన్లో ఉన్నాయి. India Vix 14.29గా ఉంది.
Similar News
News November 2, 2025
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, సిద్దిపేట, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, యాదాద్రి, నల్గొండలో వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపారు. HYDలో సాయంత్రం నుంచి వాన పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురు జల్లులు పడే ఆస్కారమున్నట్లు వివరించారు.
News November 2, 2025
రైల్టెల్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News November 2, 2025
వీళ్లు తీర్థయాత్రలు వెళ్లాల్సిన పని లేదు

కార్తీక వ్రత మహత్యం చాలా గొప్పదని పండితులు చెబుతున్నారు. ‘భూమ్మీదున్న పుణ్యక్షేత్రాలన్నీ కార్తీక వ్రతస్థుని శరీరమందే ఉంటాయి. ఇంద్రాదులు కూడా ఈ వ్రతస్థులను సేవిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన చోటు నుంచి గ్రహ, భూత పిశాచ గణాలు పారిపోతాయి. నిష్ఠగా కార్తీక వ్రతం చేసే వారి పుణ్యాన్ని చెప్పడం ఆ బ్రహ్మకే సాధ్యం కాదు. ఈ కార్తీక వ్రతాన్ని విడువక ఆచరించేవారు తీర్థయాత్రల అవసరమే లేదు’ అని అంటున్నారు. <<-se>>#Karthikam<<>>


