News December 31, 2024
Stock Market: చివరి సెషన్ నష్టాలతో ఆరంభం
2024లో చివరి ట్రేడింగ్ సెషన్ను బెంచ్ మార్క్ సూచీలు నష్టాలతో ఆరంభించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 463 పాయింట్ల నష్టంతో 77,784 వద్ద, నిఫ్టీ 102 పాయింట్లు కోల్పోయి 23,542 వద్ద కదులుతున్నాయి. ఐటీ షేర్లు అత్యధికంగా 2% నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. కీలకమైన బ్యాంకు, ఫైనాన్స్, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలపై అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ONGC, BEL గ్రీన్లో ఉన్నాయి. India Vix 14.29గా ఉంది.
Similar News
News January 23, 2025
ఓలా, ఉబర్ సంస్థలకు కేంద్రం నోటీసులు
క్యాబ్ బుక్ చేసుకునేవారికి మొబైల్ ఫోన్ల ఆధారంగా ఛార్జ్ వేస్తున్నారనే <<15225725>>ఫిర్యాదులపై<<>> కేంద్రం చర్యలకు దిగింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఓలా, ఉబర్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఒకే రకమైన సేవకు వేర్వేరు ఛార్జీలు వసూలు చేయడంపై స్పందించాలని కోరింది. ఐఫోన్లో రైడ్ బుక్ చేస్తే ఒకలా, ఆండ్రాయిడ్ ఫోన్లో బుక్ చేస్తే ఇంకొకలా ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
News January 23, 2025
పాపడాలు అమ్మి రోజుకు రూ.10వేలు సంపాదన
పొట్టకూటి కోసం పాపడాలమ్మే చక్రధర్ రాణా రోజుకు రూ.10వేలు సంపాదిస్తున్నారని తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఉడాలా వీధుల్లో ఈయన 50 ఏళ్లుగా పాపడాలు అమ్ముతున్నారు. రోజూ 30-40 కిలోమీటర్లు నడిచి స్థానిక మార్కెట్లో విక్రయిస్తుంటారు. ఒక్కటి రూ.10 చొప్పున రోజూ వెయ్యి పీసులు అమ్మి రూ.10వేలు సంపాదిస్తున్నారు. తొలినాళ్లలో ఒక్కోటి 5 పైసలకు అమ్మేవారు.
News January 23, 2025
దావోస్ ఖర్చెంత? పెట్టుబడులు ఎన్ని?: అంబటి
AP: దావోస్ నుంచి ప్రభుత్వం ఎన్ని పెట్టుబడులు తెచ్చిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ‘దావోస్ వెళ్లి రావడానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? దావోస్ నుంచి పెట్టుబడులు ఏ మేరకు తెచ్చారు? తెలియపరిస్తే వినాలని ఉంది!’ అని ట్వీట్ చేశారు.