News March 16, 2024

ఐపీఎల్ ఇండియాలోనే

image

IPL రెండో ఫేజ్ మ్యాచులను విదేశాల్లో నిర్వహిస్తారని వస్తున్న వార్తలను ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఖండించారు. ‘మేము కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సంప్రదిస్తున్నాం. తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. త్వరలో ఐపీఎల్ రెండో ఫేజ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకటిస్తాం. ఈ ఏడాది ఐపీఎల్ ఇండియాలోనే జరుగుతుంది. విదేశాలకు తరలించే అవకాశమే లేదు’ అని ఆయన చెప్పారు.

Similar News

News August 25, 2025

ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన వెంట పలువురు మంత్రులు ఉన్నారు. ఈ సాయంత్రం న్యాయ నిపుణులతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై సీఎం చర్చించే అవకాశం ఉంది. రేపు ఉదయం బిహార్‌లో జరుగుతున్న రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రలో పాల్గొననున్నారు.

News August 25, 2025

సత్తా చాటిన విద్యార్థులకు సీఎం అభినందనలు

image

AP: రాష్ట్రంలోని సోషల్ వెల్ఫేర్ బడుల్లో చదివి ఈ ఏడాది IIT, నిట్, నీట్‌లో సీట్లు సాధించిన విద్యార్థులను CM చంద్రబాబు అభినందించారు. సీట్లు సాధించిన 55 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఇవాళ సచివాలయంలో సీఎంను కలిశారు. పేదరికం నుంచి వచ్చి ఉత్తమ ప్రతిభ చూపిన వారికి సీఎం ఆల్ ది బెస్ట్ చెప్పారు. విద్యార్థులకు మెమెంటోలు, ఒక్కో విద్యార్థికి రూ.లక్ష చొప్పున చెక్ అందించి వారితో విడివిడిగా ఫొటోలు దిగారు.

News August 25, 2025

ఎల్లుండి నుంచి OTTలో ‘కింగ్డమ్’ స్ట్రీమింగ్

image

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ‘కింగ్డమ్’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. వినాయకచవితి కానుకగా ఈనెల 27నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుని రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించారు.