News January 2, 2025

కళ్లలోంచి తలలోకి బాణసంచా దూసుకెళ్లి మృతి

image

AP: న్యూఇయర్ వేడుకల్లో విశాఖలో విషాదం నెలకొంది. GVMC 87వ వార్డులో నివాసముండే శివ డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత ఇంటి మేడపై న్యూఇయర్ సంబరాల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన అనంతరం క్రాకర్స్ పేల్చుతుండగా గన్‌షాట్ క్రాకర్ సరిగా పేలలేదు. దీంతో దాని దగ్గరికెళ్లి చూడగా ఒక్కసారిగా పేలిన క్రాకర్ కళ్లలోంచి తలలోకి దూసుకెళ్లడంతో శివ చనిపోయాడు. ఘటనపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News January 13, 2026

పసుపును ఆరబెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

పసుపును ఉడకబెట్టిన తర్వాత శుభ్రం చేసిన పదునైన నేల లేదా టార్పాలిన్ షీట్ లేదా సిమెంట్ నేలపై కుప్పగా పోయాలి. ఒకరోజు తర్వాత 2,3 అంగుళాల మందం ఉండేలా పరచాలి. మరీ పలుచగా పరిస్తే పసుపు రంగు చెడిపోతుంది. పరిచిన పసుపును మధ్యాహ్నం సమయంలో తిరగబెడితే సమానంగా ఎండుతాయి. పసుపు దుంపలు లేదా కొమ్ముల్లో తేమ 8 శాతం వచ్చే వరకు ఎండబెట్టాలి. ఈ స్థితికి రావడానికి 18- 20 రోజులు పడుతుంది. రాత్రివేళ టార్పాలిన్లు కప్పాలి.

News January 13, 2026

సంక్రాంతి: ముగ్గులు వేస్తున్నారా?

image

సంక్రాంతి పండుగకు ముగ్గులు వేయడం మన సంప్రదాయం. అయితే అందులో బియ్యప్పిండి కలపడం ద్వారా చీమలు, పక్షులు వంటి చిన్న జీవులకు ఆహారం అందించిన వాళ్లమవుతాం. పూర్వం ముగ్గులో బియ్యప్పిండి కలిపే వేసేవారు. ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలను ఉంచి, పూలతో అలంకరించడం వల్ల ఆ ప్రాంతం మహాలక్ష్మికి నివాసంగా మారుతుందని నమ్మకం. రథాల ముగ్గులు వేయడం వల్ల అమ్మాయిలలో సృజనాత్మకత పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

News January 13, 2026

తగ్గిన బాస్మతీ రైస్ ధరలు.. కారణమిదే

image

ఇరాన్‌లో జరుగుతున్న అల్లర్ల ప్రభావం మన బాస్మతీ బియ్యంపై పడింది. ఎగుమతులు నిలిచిపోవడంతో దేశీయ మార్కెట్లో ధరలు కిలోకు ₹5-10 వరకు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 5.99 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇరాన్‌కు ఎగుమతి అయ్యాయి. అక్కడ గొడవలతో పేమెంట్లు ఆగిపోవడం, షిప్‌మెంట్లు ఆలస్యం కావడంతో ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇరాన్‌లో అస్థిరత వల్ల ధరలు ఇంకా తగ్గొచ్చని అంచనా.