News January 2, 2025
కళ్లలోంచి తలలోకి బాణసంచా దూసుకెళ్లి మృతి
AP: న్యూఇయర్ వేడుకల్లో విశాఖలో విషాదం నెలకొంది. GVMC 87వ వార్డులో నివాసముండే శివ డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత ఇంటి మేడపై న్యూఇయర్ సంబరాల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన అనంతరం క్రాకర్స్ పేల్చుతుండగా గన్షాట్ క్రాకర్ సరిగా పేలలేదు. దీంతో దాని దగ్గరికెళ్లి చూడగా ఒక్కసారిగా పేలిన క్రాకర్ కళ్లలోంచి తలలోకి దూసుకెళ్లడంతో శివ చనిపోయాడు. ఘటనపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News January 14, 2025
ఒక్కొక్కరికి 6 కేజీల సన్నబియ్యం: మంత్రి
TG: రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి రూ.6 కేజీల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. దీని వల్ల ప్రభుత్వంపై రూ.12వేల కోట్ల వరకూ భారం పడుతుందన్నారు. ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం రేషన్ లబ్ధిదారులకు ఒకొక్కరికి 6 కిలోల దొడ్డు బియ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులను ఈనెల 26 నుంచి జారీ చేయనున్నారు.
News January 14, 2025
Stock Markets: నేడు పుల్బ్యాక్ ర్యాలీకి ఛాన్స్!
దేశీయ స్టాక్మార్కెట్లలో నేడు పుల్బ్యాక్ ర్యాలీకి ఆస్కారం కనిపిస్తోంది. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 160PTS లాభంతో 23,289 వద్ద ట్రేడవుతుండటం సానుకూల పరిణామం. డాలర్ ఇండెక్స్ పెరుగుతున్నప్పటికీ బాండ్ యీల్డులు, క్రూడాయిల్ ధరలు కాస్త తగ్గాయి. జపాన్ నిక్కీ భారీగా పతనమైంది. తైవాన్ సూచీ పెరిగింది. STOCKS 2 WATCH: HCL, ANGEL ONE, ANAND RATHI, HSCL, DEN, ADANI ENERGY
News January 14, 2025
విద్యుత్ ఛార్జీల పెంపు లేనట్టే!
TG: వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలను పెంచొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఛార్జీల పెంపునకు డిస్కంలు అనుమతి కోరగా తిరస్కరించింది. ప్రస్తుత ఛార్జీలనే కొనసాగించాలని ఆదేశించింది. ఇదే విషయాన్ని పేర్కొంటూ ERCకి ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఈ మేరకు ఈనెల 18న డిస్కంలు తమ ప్రతిపాదనలను ERCకి సమర్పించే ఛాన్సుంది. డిస్కంల నష్టాల మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తేనే ఛార్జీల పెంపు ఉండదని సమాచారం.