News March 17, 2024
KKR క్యాంపులో చేరిన శ్రేయస్ అయ్యర్

కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆ జట్టుతో చేరారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంపులో అయ్యర్ అడుగు పెట్టారు. కాగా అయ్యర్ ఇటీవల వెన్నునొప్పి గాయంతో సతమతమవుతున్నారు. ఇంగ్లండ్తో సిరీస్ మధ్యలో గాయంతో వైదొలిగారు. అనంతరం ముంబై తరఫున రంజీల్లో ఆడారు. మళ్లీ వెన్నునొప్పితో బాధపడ్డారు. ప్రస్తుతం అతడు IPLలో ఆడేది కూడా అనుమానమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Similar News
News August 25, 2025
AP, TGకి 18,900 మెట్రిక్ టన్నుల యూరియా

ఏపీ, తెలంగాణతో పాటు మొత్తం 4 రాష్ట్రాలకు 30,491 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. బిహార్కు 2,700, ఏపీకి 10,800, తెలంగాణకు 8,100, ఒడిశాకు 8,891 మెట్రిక్ టన్నులు కేటాయించింది. దీని వల్ల యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు కాస్త ఉపశమనం లభించనుంది.
News August 25, 2025
వికలాంగుల పెన్షన్లు రద్దు చేయలేదు: మంత్రి పయ్యావుల

AP: వికలాంగుల పెన్షన్లు రద్దు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఖండించారు. ‘కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చాం. 40% పైబడి అంగవైకల్యం ఉన్న వారికే పెన్షన్లు ఇస్తాం. నోటీసులు అందుకున్న వారు మెడికల్ బోర్డు దగ్గర తమ వైకల్యం నిరూపించుకోవాలి. మెడికల్ బోర్డు సర్టిఫికెట్ ఆధారంగానే పెన్షన్లు అందిస్తాం’ అని స్పష్టం చేశారు. అటు SEP 6న అనంతపురంలో CM CBN పర్యటిస్తారని ఆయన వెల్లడించారు.
News August 25, 2025
ఇన్స్టా చూడటమే ఉద్యోగం!

కొందరు ఎక్కువసేపు సోషల్ మీడియా చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. అలాంటి వారికి ఉద్యోగం ఇచ్చే కంపెనీ ఒకటుంది. ముంబైకి చెందిన మాంక్ ఎంటర్టైన్మెంట్ ‘డూమ్ స్క్రోలర్’ పేరిట ఉద్యోగ అవకాశాన్ని ఇస్తోంది. సదరు ఉద్యోగి ప్రధానంగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్స్లో కనీసం 6 గంటల సమయం గడుపుతూ ట్రెండింగ్ అంశాలు, వైరల్ కంటెంట్ను గుర్తించాలి. వీరికి హిందీ & ఇంగ్లిష్ వచ్చి ఉండాలి.