News March 17, 2024

కడప: ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం

image

కడప జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ విజయరామ రాజు పేర్కొన్నారు. కడప కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ సిద్దార్థ్ కౌశల్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 16.22 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, పురుషులు 7.92 లక్షలు, మహిళలు 8.29 లక్షల మంది, 214 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారన్నారు. 2035 పోలింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News April 7, 2025

ఒంటిమిట్ట: అధికారులకు మంత్రుల దిశానిర్దేశం

image

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 11న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో లోటుపాట్లు లేకుండా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సవితలు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం ఒంటిమిట్ట టీటీడీ కళ్యాణ మండపం సమీపంలోని పరిపాలన భవన మందిరంలో సమావేశం నిర్వహించారు. అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

News April 7, 2025

కడప: నదిలో యువకుడి గల్లంతు

image

కడప నగర సమీపాన ఉన్న వాటర్ గండిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. నగరంలోని రియాజ్ థియేటర్ సమీపంలోని సమీర్ (17) తన స్నేహితులతో కలిసి ఈత కోసం ఆదివారం పెన్నానదిలోకి దిగారు. ప్రమాదవశాత్తు ముగ్గురూ అందులో మునిగారు. స్థానికులు గమనించి అందులో ఇద్దరిని కాపాడారు. సమీర్ కనిపించలేదని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 7, 2025

బద్వేల్: అత్తింటికే కన్నం వేసిన అల్లుడు

image

అత్తింటికే అల్లుడు కన్నం వేసిన ఘటన బద్వేల్లో చోటు చేసుకుంది. గోపవరం(M) T.సండ్రపల్లెకు చెందిన పిచ్చయ్య, పెంచలమ్మ కొన్నేళ్లుగా బద్వేల్‌లోని తెలుగుగంగ కాలనీలో ఉంటున్నారు. పెద్ద కూతురుకి మురళితో వివాహం చేశారు. ఇటీవల పిచ్చయ్య అనారోగ్యంతో చనిపోయారు. అంత్యక్రియల కోసం T.సండ్రపల్లెకు వెళ్లారు. ఇదే అదునుగా బద్వేల్‌లోని అత్త ఇంట్లోకి మురళి చొరబడి రూ.7 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. చివరికి కటకటాల పాలయ్యాడు.

error: Content is protected !!