News March 17, 2024

కడప: ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం

image

కడప జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ విజయరామ రాజు పేర్కొన్నారు. కడప కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ సిద్దార్థ్ కౌశల్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 16.22 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, పురుషులు 7.92 లక్షలు, మహిళలు 8.29 లక్షల మంది, 214 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారన్నారు. 2035 పోలింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News March 24, 2025

కడప: యథావిధిగా ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ’

image

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను సోమవారం కడప కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్‌వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. జిల్లా అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు ఉంటుందని తెలిపారు.

News March 23, 2025

సిద్దవటం: పూరిల్లు దగ్ధం.. వృద్ధుడు సజీవ దహనం

image

సిద్దవటం మండలంలోని మూలపల్లిలో పూరిల్లు దగ్ధం కావడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. అయ్యవారి రెడ్డి స్వామి సమీపంలోని సత్రం వద్ద ఆదివారం పూరి ఇంట్లో ఉన్న పిల్లి రాజారెడ్డి(75) వృద్ధుడికి కంటి చూపు కనపడదన్నారు. కట్టెల పొయ్యి మీద అన్నం చేస్తుండగా ప్రమాదవ శాత్తు పూరింటికి మంటలు అంటుకొని అగ్నికి ఆహుతయ్యాడన్నారు. ఒంటిమిట్ట సీఐ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

News March 23, 2025

పులివెందుల: వివేకా హత్య.. రంగంలోకి సిట్ బృందం

image

వైఎస్ వివేకా హత్య కేసులో సిట్ బృందం రంగంలోకి దిగింది. ఈ కేసులో అనుమానాస్పదంగా మృతి చెందిన సాక్షుల మరణాలపై సిట్ బృందం విచారణ చేపడుతోంది. అనుమానాస్పదంగా మృతి చెందిన సింహాద్రిపురం(M) కసనూరు (V)కు చెందిన కటిక రెడ్డి శ్రీనివాసులురెడ్డి కుటుంబ సభ్యులను విచారించినట్లు తెలిసింది. కేసు విచారణ ఆరు నెలల్లో పూర్తి చేయాలని వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది.

error: Content is protected !!