News March 17, 2024
నేడు ఢిల్లీకి కేటీఆర్, హరీశ్

TS: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ ఏడు రోజుల కస్టడీ విధించింది. దీంతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. వీరితోపాటు ప్రశాంత్ రెడ్డి జీవన్ రెడ్డి జాన్సన్ నాయక్ కూడా హస్తినకు వెళ్లనున్నారు. వీరందరూ కవితను కలవనున్నారు. కాగా కవిత అరెస్ట్పై ఆమె తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటివరకూ స్పందించలేదు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ నుంచి ఫామ్హౌజ్కు వెళ్లిపోయినట్లు సమాచారం.
Similar News
News August 26, 2025
ఉచిత బస్సుల్లో త్వరలో లైవ్ ట్రాకింగ్: సీఎం CBN

AP: మహిళల సహకారంతో ‘స్త్రీశక్తి’ గ్రాండ్ సక్సెస్ అయిందని పథకంపై సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు అధికారులతో అన్నారు. ‘ఉచిత బస్సుల్లో త్వరలో లైవ్ ట్రాకింగ్ ఏర్పాటు చేస్తాం. స్త్రీశక్తి బస్సులకు రెండు వైపులా బోర్డులు పెట్టండి. రాష్ట్ర మహిళల్లో చైతన్యం ఎక్కువగా ఉంటోంది. ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకొని అభివృద్ధి చెందుతారు’ అని సీఎం తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం అమలవుతోన్న విషయం తెలిసిందే.
News August 25, 2025
6,589 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

SBIలో 6,589 జూనియర్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. అభ్యర్థుల వయసు 20-28 ఏళ్లు ఉండాలి. డిగ్రీ చేసిన వారు అర్హులు. ఫైనలియర్ చదువుతున్న వారూ అప్లై చేయవచ్చు. కానీ DEC 31, 2025కి ముందు డిగ్రీ పాసై ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్, OBC, EWS కేటగిరీ విద్యార్థులకు ₹750. మిగతా వారికి లేదు.
వెబ్సైట్: <
News August 25, 2025
ఐదుగురు మెడికల్ విద్యార్థులు సస్పెండ్

TG: నిజామాబాద్ మెడికల్ కాలేజీ ర్యాగింగ్ ఘటనలో ఐదుగురు హౌస్ సర్జన్లపై చర్యలు తీసుకున్నారు. 6 నెలలు సస్పెండ్ చేయడంతో పాటు హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగించారు. ప్రిన్సిపల్ కృష్ణమోహన్ అధ్యక్షతన ఇవాళ జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదవడంతో పోలీసుల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి. కాగా రాహుల్ అనే విద్యార్థిని సీనియర్లు వేధించగా, తిరిగి ప్రశ్నించడంతో అతడిని చితకబాదారు.