News March 17, 2024
శ్రీకాకుళం: మొదటిసారి ఎమ్మెల్యేలుగా పోటి

2024 సార్వత్రిక ఎన్నికల బరిలోకి ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పిరియా విజయ మొదటిసారి పోటీకి సిద్ధమవుతున్నారు. శ్రీకాకుళం జడ్పీ చైర్ పర్సన్గా కొనసాగుతున్న పిరియా విజయకు పార్టీ టికెట్ కేటాయించింది. అటు రాజాంలో డాక్టర్గా పనిచేస్తున్న తలే రాజేశ్ కూడా మొదటిసారి పోటీకి సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మొదటిసారి కావడంతో వీరికి విజయం వరిస్తుందో..? లేదో..? వేచి చూద్దాం.
Similar News
News December 28, 2025
కంచిలి వద్ద ప్రమాదం.. 10th విద్యార్థి స్పాట్డెడ్

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రణీత్ ఆదివారం కావడంతో తండ్రితో కలిసి బైక్పై సోంపేట మండలం పత్రకొండ నుంచి కంచిలి వస్తుండగా జలంత్రకోట జాతీయ రహదారిపై లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థి మట్టా ప్రణీత్(16) మృతి చెందగా.. అతని తండ్రి హేమంతరావుకు (45) తీవ్ర గాయాలయ్యాయి. వీరిని సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News December 28, 2025
శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీలు పెరగనున్నాయా?

శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల్లో ప్రస్తుతం 912 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన, పాలనా సౌలభ్యంకోసం ప్రజలనుంచి వినతలు వచ్చాయి. ఈ మేరకు 52 కొత్త పంచాయితీల ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధం చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి భారతి, సౌజన్య చెప్పారు. జిల్లా కలెక్టర్ అనుమతుల తర్వాత పంచాయతీ విభజన సాధ్యమవుతుందన్నారు.
News December 28, 2025
SKLM: ‘విధుల్లో మరింత ప్రగతి సాధించాలి’

పోలీస్ అధికారులు విధుల్లో మరింత ప్రగతి సాధించాలని జిల్లా ఎస్పీ మహేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో ముఖ్యమైన కేసులు, ప్రాపర్టీ నేరాల చేదన, ముద్దాయిల అరెస్టు, నిందితులకు శిక్షలుపడే విధంగా చేసిన కృషి, లోక్ అదాలత్ కేసులు పరిష్కారం వంటి అంశాల్లో చాకచక్యంగా వ్యవహరించి ప్రతిభ కనబరిచిన అధికారులనకు సర్టిఫికెట్లు ఇచ్చి అభినందించారు.


