News March 17, 2024

చిలకలూరిపేట సభకు మోదీ పర్యటన వివరాలు

image

మండలంలోని బొప్పూడి వద్ద నేడు జరగనున్న టీడీపీ కూటమి బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. సభకు ప్రధానమంత్రి మోదీ హాజరవుతారు. ఆదివారం సాయంత్రం 4. 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడకు వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 5 నుంచి 6 గంటల వరకు ప్రసంగిస్తారు. 6.10 గంటలకు తిరుగుపయనమవుతారు. 6.55 గంటలకు గన్నవరం చేరుకొని, 7:00 గంటలకు హైదరాబాద్ వెళతారు.

Similar News

News September 3, 2025

అరుదైన కవయిత్రి కాంచనపల్లి కనకమ్మ

image

సంస్కృతాంధ్ర రచయిత్రి కాంచనపల్లి కనకమ్మ సెప్టెంబరు 3, 1893లో ఉమ్మడి గుంటూరు జిల్లా దుర్గిలో జన్మించారు. బాల్యవితంతువైన కనకమ్మ BA ఆంగ్లంలో డిగ్రీ పొంది కొంతకాలం కళాశాలలో పనిచేశారు. ఆనాటి అన్ని స్త్రీల పత్రికలలోను వీరి రచనలు ప్రచురించబడ్డాయి. అనేక సంస్కృత నాటకాలను ఆంధ్రీకరించారు. వీరి కృషికి గుర్తింపుగా ‘కవితా విశారద’, ‘కవితిలక’ అనే బిరుదులు, కేసరి గృహలక్ష్మి స్వర్ణకంకణం అందుకున్నారు.

News September 2, 2025

మేరికపూడిలో విషాదం.. తండ్రీకొడుకుల దుర్మరణం

image

ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామంలో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు మృతిచెందారు. ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో భార్గవ్ (23) అక్కడికక్కడే మరణించగా, ఆయన తండ్రి వెంకటేశ్వర్లు (55) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో ఇద్దరి మృతి స్థానికులను కంటతడి పెట్టించింది.

News September 2, 2025

తెనాలిలో 108 మంది వీణ కళాకారులతో సంగీత ఉత్సవం

image

తెనాలికి చెందిన శ్రీ విద్యాపీఠం, సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన వీణ సంగీత ఉత్సవం జరుగనుంది. మూలా నక్షత్రం సందర్భంగా చెంచుపేటలోని పద్మావతి కల్యాణ మండపంలో ఆరోజు సాయంత్రం 5.15 గంటలకు సంగీత ఉత్సవం ప్రారంభమవుతుందని పెనుగొండ శ్రీ వాసవి క్షేత్ర పీఠాధిపతి బాల స్వామీజీ తెలిపారు. వివిధ ప్రాంతాలకు చెందిన 108 మంది వీణ కళాకారులతో తెనాలిలో తొలిసారిగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.