News January 8, 2025

రామమందిరంలోకి సీక్రెట్ కెమెరాతో ప్రవేశించిన వ్యక్తి అరెస్ట్

image

అయోధ్య రామమందిరంలోకి ఓ వ్యక్తి సీక్రెట్ కెమెరాతో ప్రవేశించాడు. కళ్ల జోడుకు ప్రత్యేకంగా అమర్చిన కెమెరాలతో మందిరంలో ఫొటోలు తీసేందుకు ప్రయత్నించాడు. అనుమానాస్పదంగా కనిపించడంతో ఆలయ అధికారులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వడోదరకు చెందిన జైకుమార్‌గా గుర్తించారు. కాగా మందిరంలో ఫొటోలు, వీడియోలు తీయడం నిషిద్ధం.

Similar News

News September 17, 2025

నమో డ్రోన్ దీదీ పథకం గురించి తెలుసా?

image

మహిళా సాధికారత కోసం కేంద్రం పలు పథకాలు ప్రవేశపెట్టింది. అందులో ఒకటే <>నమో డ్రోన్ దీదీ.<<>> మహిళా స్వయం సహాయ సంఘాల్లోని సభ్యులకు డ్రోన్ టెక్నాలజీని పరిచయం చేయడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. మహిళా సంఘాలకు డ్రోన్లు కొనుగోలు చేసుకునేందుకు 80 శాతం సబ్సిడీతో లోన్స్ ఇస్తోంది కేంద్రం. గరిష్ఠంగా రూ.8 లక్షల వరకు రాయితీ పొందవచ్చు. డ్రోన్ కోసం కావాల్సిన మిగతా డబ్బులను 3 శాతం నామ మాత్రపు వడ్డీ రేటుతో రుణం ఇస్తోంది.

News September 17, 2025

పాకిస్థాన్ మ్యాచులకు రిఫరీగా రిచర్డ్‌సన్!

image

ఆసియా కప్: షేక్‌హ్యాండ్ వివాదంలో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ని తొలగించాలని పాకిస్థాన్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను ఆసియా కప్ నుంచి తొలగించకపోతే తాము UAEతో మ్యాచ్ ఆడబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాక్ మ్యాచులకు పైక్రాఫ్ట్‌ను ICC దూరం పెట్టినట్లు తెలుస్తోంది. UAEతో మ్యాచ్‌కు రిఫరీగా రిచర్డ్‌సన్‌ను నియమించినట్లు PCB సభ్యుడు చెప్పారని PTI కథనం ప్రచురించింది.

News September 17, 2025

భూమనకు తిరుపతి నేలపై నడిచే అర్హత లేదు: మంత్రి స్వామి

image

AP: తిరుమల విషయంలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి DBV స్వామి అభిప్రాయపడ్డారు. YCP నేత భూమనకు శ్రీవిష్ణువు, శని దేవుని విగ్రహానికి తేడా తెలియదా అని నిలదీశారు. ఆయనకు తిరుపతి నేలపై నడిచే అర్హత లేదని ధ్వజమెత్తారు. వేంకన్న పాదాలు పట్టుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమలపై YCP నేతలు నిత్యం విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంకన్నతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవన్నారు.