News January 8, 2025

రామమందిరంలోకి సీక్రెట్ కెమెరాతో ప్రవేశించిన వ్యక్తి అరెస్ట్

image

అయోధ్య రామమందిరంలోకి ఓ వ్యక్తి సీక్రెట్ కెమెరాతో ప్రవేశించాడు. కళ్ల జోడుకు ప్రత్యేకంగా అమర్చిన కెమెరాలతో మందిరంలో ఫొటోలు తీసేందుకు ప్రయత్నించాడు. అనుమానాస్పదంగా కనిపించడంతో ఆలయ అధికారులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వడోదరకు చెందిన జైకుమార్‌గా గుర్తించారు. కాగా మందిరంలో ఫొటోలు, వీడియోలు తీయడం నిషిద్ధం.

Similar News

News January 20, 2025

వెళ్తూ వెళ్తూ బైడెన్ సంచలన నిర్ణయం

image

మరికొద్ది గంటల్లో అధ్యక్షుడి కుర్చీ నుంచి దిగబోతున్న జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్య నిపుణులు, కొవిడ్ రెస్పాన్స్ చీఫ్ డా.ఆంటోనీ ఫౌచీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లె, క్యాపిటల్ హిల్ దాడులపై విచారణ జరిపిన హౌస్ కమిటీ సభ్యులకు ముందస్తు క్షమాభిక్ష ప్రకటించారు. బైడెన్ తనకున్న అసాధారణ అధికారాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ట్రంప్ ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది.

News January 20, 2025

కల్తీ/నకిలీ పనీర్‌ను ఇలా తెలుసుకోండి..

image

నాన్‌వెజ్‌కు ప్రత్యామ్నాయంగా వాడే పనీర్‌లో నకిలీ/కల్తీ పెరిగాయి. దానిని గుర్తించేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. డ్రై పాన్‌పై చిన్న పీస్‌ను వేడి చేయండి. ఒరిజినలైతే కలర్ బ్రౌన్‌గా మారి ముక్క కొంత పొడిపొడిగా అవుతుంది. ఉడికించిన పనీర్‌ను చల్లారబెట్టి ఆ నీటిలో అయోడిన్ చుక్కలు వేయండి. స్టార్చ్ ఉంటే నీరు నీలంగా మారుతుంది. ఇక కందిపొడి వేస్తే పనీర్ రెడ్‌గా మారిందంటే యూరియా, సర్ఫ్ వంటి కెమికల్స్ ఉన్నట్టే.

News January 20, 2025

చంద్రబాబు హయాంలో ఒక్క అప్పడాల మెషిన్ కూడా రాలేదు: YCP

image

చంద్రబాబు గెలిస్తే చాలు దావోస్ వెళ్లి పెట్టుబడులంటూ బిల్డప్ ఇస్తారని YCP విమర్శించింది. ‘అధికారంలో ఉన్న ఐదేళ్లూ దావోస్ వెళ్లి ఫోటోలు దిగి ప్రచారం చేసుకోవడం తప్ప ఇన్నేళ్లలో ఒక్క అటుకుల మిల్లు, అప్పడాల మెషిన్ కూడా రాలేదు. తండ్రీకొడుకులు ప్రజా ధనంతో షికార్లు చేసి వస్తారు. జగన్ తన హయాంలో ఎలాంటి హంగామా లేకుండా దావోస్ వెళ్లారు. అప్పుడు రూ.1,26,000 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి’ అని ట్వీట్ చేసింది.